దుక్కిపాటి మధుసూదనరావు
From Wikipedia, the free encyclopedia
దుక్కిపాటి మధుసూదనరావు (జూలై 27, 1917 - మార్చి 26, 2006) అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు నిర్మించిన తెలుగు నిర్మాత. దుక్కిపాటికి తెలుగు సినిమాతో 1940 నుంచే అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవితాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యుల్లో దుక్కిపాటి గారు ఒకరు.
త్వరిత వాస్తవాలు దుక్కిపాటి మధుసూదనరావు, జననం ...
దుక్కిపాటి మధుసూదనరావు | |
---|---|
జననం | దుక్కిపాటి మధుసూదనరావు జూలై 27, 1917 కృష్ణా జిల్లా గుడివాడ తాలూకులోని పెయ్యూరు |
మరణం | మార్చి 26, 2006 |
మరణ కారణం | న్యుమోనియా వ్యాధి |
ఇతర పేర్లు | దుక్కిపాటి |
ప్రసిద్ధి | ప్రముఖ తెలుగు నిర్మాత |
తండ్రి | సీతారామ స్వామి |
తల్లి | గంగాజలం |
మూసివేయి
దుక్కిపాటి గారు 10 సెప్టెంబరు 1951 తేదీన అక్కినేని నాగేశ్వరరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టి.వి.ఎ.సూర్యారావులతో కలసి అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థను స్థాపించి, మొదటి ప్రయత్నంగా దొంగరాముడు (1955) సినిమాను తీశారు. తమ సంస్థ తీసే మొదటి సినిమాకు కె.వి.రెడ్డిగారే దర్శకత్వం వహించాలని ఉద్దేశించి రెండేళ్ళు కాచుకొని దొంగరాముడు సినిమా నిర్మించారు.