![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/78/Bengal-Tiger_Corbett_Uttarakhand_Dec-2013.jpg/640px-Bengal-Tiger_Corbett_Uttarakhand_Dec-2013.jpg&w=640&q=50)
జిమ్ కార్బెట్ జాతీయ వనం
భారతదేశంలోని జాతీయవనం / From Wikipedia, the free encyclopedia
[[Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in మాడ్యూల్:Arguments at line 260: table index is nil.]]
జిమ్ కార్బెట్ జాతీయ వనం | |
---|---|
IUCN category II (national park) | |
![]() కార్బెట్ జాతీయ వనంలో ఒక బెంగాల్ పులి | |
Location | నైనీటాల్ జిల్లా, ఉత్తరాఖండ్, భారతదేశం |
Nearest city | రామ్నగర్, కోట్ద్వార్ |
Coordinates | 29°32′55″N 78°56′7″E |
Area | 1,318 km2 |
Established | 1936 |
Visitors | 500,000[1] (in 1999) |
Governing body | ప్రాజెక్ట్ టైగర్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం, వైల్డ్లైఫ్ వార్డెన్, జిమ్ కార్బెట్ జాతీయ వనం |
జిమ్ కార్బెట్ జాతీయ వనం భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో ఉన్న ఒక జాతీయ వనం. ఇది 1936లో బ్రిటిషు పాలన సమయంలో భారతదేశ మొట్టమొదటి జాతీయ వనంగా స్థాపించబడింది. అప్పటి యునైటెడ్ ప్రావిన్సెస్ గవర్నర్ విలియం మాల్కం హేలీ పేరు మీద హెయిలీ నేషనల్ పార్క్ అని దీనికి పేరు పెట్టారు. 1956లో, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు ఒక దశాబ్దం తరువాత, దీనికి కార్బెట్ జాతీయ వనంగా మార్చారు. అంతకు సంవత్సరం ముందు మరణించిన వేటగాడు, ప్రకృతి శాస్త్రవేత్త, ఈ జాతీయ వనం స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించిన జిమ్ కార్బెట్ పేరు మీద ఈ పేరు పెట్టారు. ప్రాజెక్ట్ టైగర్ కిందకు వచ్చిన మొదటి జాతీయ వనం ఇది. [2]
కార్బెట్ జాతీయ వనం 520.8 చ.కి.మీ (201.1 చ.మై)లో విస్తరించి, కొండలు, నదీ ప్రాంతాలు, చిత్తడి నేలలు, గడ్డి భూములు, ఒక పెద్ద సరస్సును కలిగి ఉంటుంది. సముద్రమట్టానికి 1,300 నుండి 4,000 అడుగుల (400 నుండి 1,220 మీ) ఎత్తులో ఉంటుంది. శీతాకాలంలో రాత్రులు చల్లగా, పగళ్ళు వెచ్చగా ప్రకాశవంతంగా ఉంటాయి. జూలై నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. ఈ ఉద్యానవనం ఉప-హిమాలయ బెల్ట్ భౌగోళిక, పర్యావరణ లక్షణాలను కలిగి ఉంది.[3] ఇక్కడి దట్టమైన తేమతో కూడిన ఆకురాల్చే అడవిలో ప్రధానంగా షోరియా రోబస్టా (సాల్ చెట్టు), హల్దు, రావి, రోహిణి, మామిడి చెట్లు) ఉంటాయి. ఈ ఉద్యానవనంలో దాదాపు 73 శాతం అటవీ ప్రాంతం ఉండగా, 10 శాతం విస్తీర్ణంలో గడ్డి భూములు ఉన్నాయి. ఇక్కడ 110 వృక్ష జాతులు, 50 క్షీరద జాతులు, 580 పక్షి జాతులు, 25 సరీసృపాల జాతులు ఉన్నాయి.
పర్యావరణ పర్యాటక స్థలమైన ఈ ఉద్యానవనంలో 617 వివిధ జాతుల మొక్కలు, విభిన్న రకాల జంతుజాతులు ఉన్నాయి.[4][5][6] పర్యాటకుల సంఖ్య పెరగడం, మరికొన్ని ఇతర కారణాల వల్ల ఉద్యానవన పర్యావరణ సమతుల్యత తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది.[7]