గురు తేగ్ బహదూర్
సిక్కుల తొమ్మిదో గురువు / From Wikipedia, the free encyclopedia
గురు తేగ్ బహదూర్ (పంజాబీ: ਗੁਰੂ ਤੇਗ਼ ਬਹਾਦਰ) (1621 ఏప్రిల్ 21 - 1675 నవంబరు 24 [1][2]), 10 మంది సిక్ఖు గురువుల్లో తొమ్మిదవ వారు. తొలి గురువు నానక్ స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఆయన రాసిన 115 కవితలు గురు గ్రంథ్ సాహిబ్ లో ఉన్నాయి. కాశ్మీరీ పండిట్లను ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేస్తూంటే వ్యతిరేకించినందుకు, తాను స్వయంగా ఇస్లాం మతంలోకి మారేందుకు తిరస్కరించినందుకుతో గురు తేగ్ బహదూర్ ను ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఢిల్లీలో బహిరంగంగా తల నరికించి చంపారు.[3][4][5][6] గురు ద్వారా సిస్ గంజ్ సాహిబ్, గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్ అన్న పేర్లతో ఢిల్లీలో ఉన్న రెండు ప్రదేశాలు ఆయనను నరికి చంపడం, ఆయన శరీరాన్ని అంత్యక్రియలు చేయడం జరిగిన ప్రదేశాలు, స్మృతి మందిరాలు.
త్వరిత వాస్తవాలు గురు తేగ్ బహదూర్, జననం ...
గురు తేగ్ బహదూర్ | |
---|---|
![]() | |
జననం | త్యాగ్ మాల్ 21 April 1621 (1621-04-21) |
మరణం | 24 November 1675 (1675-11-25) (aged 54) |
జాతీయత | భారత దేశం |
ఇతర పేర్లు | భారత దేశపు కవచం, ఖడ్గపు ఉన్నతి, తొమ్మిదో గురువు, నిజమైన రాజు |
క్రియాశీల సంవత్సరాలు | 1664–1675 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | గురు గ్రంథ్ సాహిబ్ కు ఆధ్యాత్మికమైన కృషి, బలవంతంగా మత మార్పిడికి గురవుతున్న కాశ్మీరీ పండిట్ల మతమార్పిడిని వ్యతిరేకంగా నిలిచి, తానూ ఇస్లాంలోకి మారినందుకు బలిదానం, ఆనంద్ పూర్ సాహిబ్ స్థాపన, పటియాలా స్థాపన |
అంతకు ముందు వారు | గురు హర్ క్రిషన్ |
తరువాతివారు | గురు గోబింద్ సింగ్ |
పిల్లలు | గురు గోబింద్ సింగ్ |
మూసివేయి