![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9f/Cochin_flag.svg/langte-640px-Cochin_flag.svg.png&w=640&q=50)
కొచ్చిన్ రాజ్యం
మధ్యయుగం నాటి కేరళ ప్రాంతపు రాజ్యం / From Wikipedia, the free encyclopedia
కొచ్చి (కొచ్చిన్) నగరం రాజధానిగా అదే పేరుతో ఉన్న రాజ్యం, కొచ్చిన్ రాజ్యం. ప్రస్తుత కేరళ రాష్ట్రానికి మధ్య భాగంలో ఉన్న రాజ్యం ఇది. 12వ శతాబ్దపు తొలి భాగంలో ప్రారంభమై, 1949 లో భారత డొమినియన్ రాచరికాలను రద్దు చేసే వరకు ఈ రాజ్యం కొనసాగింది.
కొచ్చిన్ రాజ్యం | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
సా.శ.12వ శతాబ్దం[1]–1949 | |||||||||
జండా | |||||||||
గీతం: ఓం నమో నారాయణాయ | |||||||||
![]() | |||||||||
స్థాయి |
| ||||||||
రాజధాని | పెరుంపడుప్పు పొన్నాని కోడుంగల్లూర్ త్రిపునితుర త్రిస్సూర్ మట్టన్చెర్రి | ||||||||
సామాన్య భాషలు | మలయాళం | ||||||||
మతం | మెజారిటీ: హిందీమతం (అధికారిక) మైనారిటీ: క్రైస్తవం యూదుమతం ఇస్లాం | ||||||||
ప్రభుత్వం | రాచరికం సంస్థానం | ||||||||
రాజా | |||||||||
• సా.శ.12వ శతాబ్దం (first) | వీర కేరళ వర్మ | ||||||||
• 1948–1949 (చివరి) | రామవర్మ XVIII | ||||||||
దివాన్ | |||||||||
• 1812–1818 (మొదటి) | జాన్ మున్రో | ||||||||
• 1944–1947 (చివరి) | సి.పి.కరుణాకర మీనన్ | ||||||||
చరిత్ర | |||||||||
• స్థాపన | సా.శ.12వ శతాబ్దం[1] | ||||||||
• పతనం | 1949 | ||||||||
GDP (PPP) | estimate | ||||||||
• Total | 600.03 కోట్ల USD | ||||||||
ద్రవ్యం | రూపాయి, ఇతర స్థానిక ద్రవ్యాలు | ||||||||
| |||||||||
Today part of | భారతదేశం |
చారిత్రికంగా కొచ్చిన్ రాజ్య రాజధాని కోడుంగల్లూర్లో ఉండేది. కానీ 1341లో వినాశకరమైన వరదల బారి నుండి తప్పించుకున్నాక, రాజధానిని కొచ్చిన్కి మార్చారు. 15వ శతాబ్దం ప్రారంభం నాటికి కొచ్చిన్ తనను తాను పూర్తిగా రక్షించుకునే సామర్థ్యాన్ని కోల్పోయింది. 15వ శతాబ్దం చివరి నాటికి కాలికట్ జామోరిన్ దండయాత్రల ఫలితంగా రాజ్య విస్తీర్ణం కనిష్ఠ స్థాయికి కుదించుకుపోయింది.
పోర్చుగీసు సైనిక దళాలు భారతదేశానికి వచ్చినప్పుడు జమోరిన్ల ధాటికి కొచ్చిన్ రాజ్యం, ఎడపల్లి , క్రాంగనోరే వంటి సామంతులను కోల్పోయింది. వీటిలో తరువాతిది చారిత్రికంగా రాజ్యానికి కేంద్రంగా కూడా ఉండేది. కొచ్చిన్ ప్రమాదంలో పడిన తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే అవకాశం కోసం చూస్తోంది. 1500 డిసెంబరు 24న రాజు ఉన్ని గోదా వర్మ పోర్చుగీసువాడైన పెడ్రో అల్వారెస్ కాబ్రాల్ను హృదయపూర్వకంగా స్వాగతించి, కాలికట్ జామోరిన్కు వ్యతిరేకంగా పోర్చుగల్, కొచ్చిన్ రాజ్యాల మధ్య కూటమి ఒప్పందాన్ని చర్చించాడు. ఈ ప్రాంతంలో పోర్చుగీస్ ఈస్ట్ ఇండీస్ నియంత్రణలో అనేక కోటలు నిర్మించారు. వీటిలో అత్యంత ముఖ్యమైనది ఫోర్ట్ మాన్యుయెల్. కొచ్చిన్, భారతదేశంలో స్థానిక, విదేశీ శక్తులకు వ్యతిరేకంగా సహాయం అందించే దీర్ఘకాలిక పోర్చుగీస్ రక్షిత రాష్ట్రంగా మారింది (1503 - 1663). లూసో - డచ్చి యుద్ధం తరువాత డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ (1663 - 1795) కొచ్చిన్ కు మిత్రరాజ్యంగా మారింది. దీని తరువాత 1809 మే 6న ఆంగ్లో - డచ్ యుద్ధం తరువాత కొచ్చిన్ రాష్ట్రంపై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ (1795 - 58) ఆధిపత్యం మొదలైంది.
ట్రావెన్కోర్ రాజ్యం కొచ్చిన్ రాజ్యంలో విలీనం అయ్యి 1950లో ట్రావెన్కోర్ - కొచ్చిన్ రాజ్యం ఏర్పాటైంది. విలావన్కోడె, కల్కులం, తోవలై, అగస్తీస్వరం , సెంగోట్టై అనే ఐదు తమిళ మెజారిటీ తాలూకాలను 1956లో ట్రావెన్కోర్ - కొచ్చిన్ నుండి మద్రాస్ రాష్ట్రానికి బదిలీ చేశారు.[2] ట్రావెన్కోర్ - కొచ్చిన్ లోని మలయాళం మాట్లాడే ప్రాంతాలు మలబార్ జిల్లాలో (లక్కదీవ్, మినికాయ్ దీవులు, మద్రాస్ రాష్ట్రంలోని దక్షిణ కెనరా జిల్లాలోని కాసరగోడ్ తాలూకాతో సహా) విలీనమయ్యాయి. భారత ప్రభుత్వ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం 1956 నవంబర్ 1న ఆధునిక కేరళ రాష్ట్రం ఏర్పడింది.[2]