కనిష్కుడు
satish కుషాణు వంశానికి చెందిన చక్రవర్తి / From Wikipedia, the free encyclopedia
ఒకటవ కనిష్కుడు, కుషాణ వంశానికి చెందిన చక్రవర్తి. ఇతను రెండవ శతాబ్దం (127-150 ఎ.డి) కి చెందిన వాడు. కనిష్కుడు సైనిక, రాజకీయ, ఆధ్యాత్మికంగా సాధించిన విజయాలకు ప్రసిద్ధి చెందినవాడు. కుషాణ వంశ వ్యవస్థాపకుడు కుజుల కడ్ఫిసెస్ వారసుడైన కనిష్కుడు బాక్ట్రియా నుంచి టరిం బేసిన్ లోని తుర్ఫాన్ నుంచి, గంగా పరీవాహక ప్రాంతమైన పాటలీపుత్ర వరకు తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కనిష్కుని ప్రధాన రాజధాని గాంధారంలోని పురుసపుర (పెషావర్). అతని మరో ప్రధాన రాజధాని కపిస.
కనిష్కుడు I | |
---|---|
కుషాణ వంశ రాజు | |
కనిష్క బంగారు నాణెం. బ్రిటీష్ మ్యూజియం. | |
పరిపాలన | 2nd century |
పూర్వాధికారి | విమా కడ్ఫిసెస్ |
ఉత్తరాధికారి | హువిష్కుడు |
జననం | పెషావర్ |
మరణం | పెషావర్ |
Burial | |
House | కుషాణ షాలు |
రాజవంశం | కుషాణులు |
మతం | హిందువు, తరువాత బౌద్ధం |
కనిష్కుని ఆక్రమణలు, బౌద్ధ ప్రచారం సిల్క్ రోడ్ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించింది. అతని కాలంలోనే బౌద్ధం సిల్క్ రోడ్ ద్వారా గాంధారాన్ని దాటి కారకోరం పర్వతశ్రేణుల ద్వారా చైనా చేరింది.
పురాతన పండితుల ప్రకారం కనిష్కుడు 78 ఎ.డిలో సింహాసనాన్ని అధిష్టించాడు. ఆ సంవత్సరంలోనే శకం ప్రారంభమైంది. కానీ నిజానికి ఈ తేదీ కనిష్కుని పట్టాభిషేక సంవత్సరం కాదని ఒక నమ్మకం. ఫాక్ ప్రకారం 127 ఎ.డిలో కనిష్కుడు సింహాసనం అధిరోహించాడు.[1]