ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ (2013)
భారత్లో నిర్మించిన మొదటి విమాన వాహక నౌక. 2013 లో దీన్ని నిర్మించారు. / From Wikipedia, the free encyclopedia
ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ భారత్ దేశీయంగా నిర్మిస్తున్న తొట్ట తొలి విమాన వాహక నౌక. విక్రాంత్ వాహక నౌకల తరగతికి చెందిన తొలినౌక ఇది. కొచ్చిన్ షిప్యార్డ్ ఈ నౌకను నిర్మిస్తోంది. ఈ నౌక జయమ్ సమ్ యుద్ధి స్పర్ధః అనే ఋగ్వేద శ్లోకాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. నన్ను ఎదుర్కొనేవారిని ఓడిస్తాను అని దీనర్థం.
1999 లో నౌక డిజైను మొదలైంది. 2009 ఫిబ్రవరి 28 న నౌక వెన్నుగాడి వేసారు. 2011 డిసెంబరు 29 న నౌక డ్రైడాక్ నుండి బయటికి నడిచింది.[1] 2015 లో నౌకను లాంచ్ చేసారు. ప్రస్తుతం నౌకలో అంతర్భాగాలు, యంత్ర సామాగ్రి మొదలైన వాటిని అమరుస్తున్నారు. ఇది 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.[2] అయితే నౌకాదళం మాత్రం 2018 నాటికి నౌకను పాక్షికంగా కమిషను చెయ్యవచ్చని భావిస్తోంది. నౌక నిర్మాణ ఖర్చు పెరిగి 2014 నాటికి రూ.19,341 కోట్లకు చేరింది.[3]
ఇదే తరగతిలో రెండో నౌకను నిర్మించేందుకు కొచ్చిన్ షిప్యార్డు ప్రతిపాదించినప్పటికీ, నౌకాదళం మాత్రం దీనికంటే పెద్దదైన అణుచోదిత వాహక నౌక నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.[3]