ఆగా ఖాన్ ప్యాలస్
పుణె నగరంలో చారిత్రక ప్రదేశం / From Wikipedia, the free encyclopedia
అగా ఖాన్ ప్యాలెస్ను భారతదేశంలోని పూణేలో సుల్తాన్ ముహమ్మద్ షా అగా ఖాన్ III నిర్మించారు. అతను నిజామి ఇస్మాలీ మతానికి చెందిన 48వ ఇమాం. పూణే కు సమీప ప్రాంతాలలో కరువుతో తీవ్రంగా దెబ్బతిన్న పేదలకు సహాయం చేయాలనుకుని నిజారి ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నాయకుడిగా అతను స్వచ్ఛంద చట్టంతో ఈ ప్యాలస్ నిర్మించారు. [1]
ఆగా ఖాన్ ప్యాలస్ | |
---|---|
ప్రదేశం | పూణే, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 18.5523°N 73.9015°E / 18.5523; 73.9015 |
విస్తీర్ణం | 19 acres (77,000 m2) |
నిర్మించినది | 1892 |
పరిపాలన సంస్థ | గాంధీ నేషనల్ మెమోరియల్ సొసైటీ |
రకం | చారిత్రిక గుర్తింపు |
నియమించబడినది | 2003 |
Designated by | ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా |
అగా ఖాన్ ప్యాలెస్ ఒక రాజయోగ్యమైన భవనం. ఈ ప్యాలెస్ భారత స్వాతంత్ర్య ఉద్యమంతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఎందుకంటే ఇది మహాత్మా గాంధీ, అతని భార్య కస్తూర్బా గాంధీ, అతని కార్యదర్శి మహాదేవ్ దేశాయ్, సరోజిని నాయుడులకు స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో బ్రిటిష్ వారు జైలుశిక్ష విధించేందుకు ఉపయోగపడింది. ఈ ప్యాలస్ లోనే మహదేవ్ దేశాయ్, కస్తూర్బా గాంధీలు మరణించారు.[2] ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఈ స్థలాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా 2003 లో ప్రకటించింది. [3] ఈ ప్యాలస్ కు గల ప్రత్యేక నిర్మాణం, పరిసరాలు పచ్చదనం, ఫోటోగ్రఫీ కోసం పరిపూర్ణ కాంతి ఉండడం వలన దీనిని వివిధ రకాల ఫోటో షూటింగుల కోసం ఫోటోగ్రాఫర్ల ఇక్కడికి వస్తారు. ఇది ఫోటోగ్రఫీకి ప్రధాన ఆకర్షణ అయిన ప్రదేశం. కానీ ఫోటోగ్రఫీ వాణిజ్యపరమైనదైనందున, పర్యాటకులకు, సందర్శకులకు విసుగు కలిగిస్తున్నందున ఈ ప్రాంగణంలో ఫోటోగ్రఫీని అనుమతించడాన్ని నిర్వాహకులు ఆపివేసారు. అగా ఖాన్ ప్యాలెస్ పరిధిలో మొబైల్ ఫోటోగ్రఫీ కూడా నిషేధించబడింది.