![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7b/Arundhati_Roy_W.jpg/640px-Arundhati_Roy_W.jpg&w=640&q=50)
అరుంధతీ రాయ్
భారతదేశ నవలార స్త్రీ / From Wikipedia, the free encyclopedia
అరుంధతీ రాయ్ (జననం: నవంబరు 24, 1961)గా ప్రసిద్ధి చెందిన సుజాన్నా అరుంధతీ రాయ్ ఒక భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి. ఈమెకు 1997లో తన రచన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు బుకర్ ప్రైజు,, 2002 లో లన్నాన్ సాంస్కృతిక స్వేచ్ఛ బహుమతి ప్రదానం చేయబడింది. బుకర్ ప్రైజు పొందిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్రకెక్కారు.
అరుంధతీ రాయ్ | |
---|---|
![]() 2013లో అరుంధతీ రాయ్ | |
పుట్టిన తేదీ, స్థలం | (1961-11-24) 1961 నవంబరు 24 (వయసు 62) షిల్లాంగ్, అస్సాం (ప్రస్తుత మేఘాలయ), భారతదేశం |
వృత్తి | నవలా రచయిత, వ్యాసకర్త, కార్యకర్త |
జాతీయత | ఇండియన్ |
కాలం | 1961 – ప్రస్తుతం |
గుర్తింపునిచ్చిన రచనలు | ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ |
పురస్కారాలు | మ్యాన్ బుకర్ ప్రైజ్ (1997) సిడ్నీ శాంతి బహుమతి (2004) |
సంతకం | ![]() |
ఈమె మేఘాలయ లోని షిల్లాంగ్లో జన్మించింది.[1] ఈమె తండ్రి బెంగాలీ, తల్లి సిరియన్ క్రిస్టియన్. ఈమె తన బాల్యం కేరళలో గడిపారు. ఉన్నతవిద్య ఢిల్లీలో చేసారు. అక్కడే తన మొదటి భర్త గెరార్డ్ డాకున్హాను కలిసారు.
రాయ్ తన రెండవ భర్త, సినీ నిర్మాత ప్రదీప్ కిషన్ ను 1984లో కలిసారు, ఇతను నిర్మించిన అవార్డు పొందిన చిత్రం "మస్సీ సాహిబ్". ఈమె నవల "ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్" వల్ల తన ఆర్థిక స్థితి మెరుగు పడింది. ఆ తరువాత ఢిల్లీలోని ఫైవ్స్టార్ హోటల్స్ లో 'ఏరోబిక్స్ క్లాసెస్' నడుపుతూ ఢిల్లీలోనే జీవిస్తున్నారు. ఈమె సమీప బంధువు ప్రణయ్ రాయ్ ప్రసిద్ధ టీవీ యాంకర్, ఎన్డీటీవిలో ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు.[2] సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, "నర్మదా బచావో" ఆందోళనను సమర్ధిస్తూ ఈమెరాసిన "ది గ్రేటర్ కామన్ గుడ్" రచన వివాదాస్పదంగా మారినది.
సాహిత్య నోబెల్ విజేత హోరాల్డ్ పింటర్ గౌరవార్ధం ప్రతియేటా ‘పెన్’ సంస్థ, బ్రిటిష్ లైబ్రరీ సంయుక్తంగా ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మకమైన బ్రిటన్ ‘పెన్’ అవార్డు 2024 సంవత్సరానికిగాను అరుంధతీ రాయ్ ని వరించింది. 2024 అక్టోబరు 10న బ్రిటిష్ లైబ్రరీలో జరగబోయే కార్యక్రమంలో ఈ పురస్కారం ఆమె అందుకోనుంది.[3]