From Wikipedia, the free encyclopedia
అజిత్ ప్రమోద్ కుమార్ జోగి ( 1946 ఏప్రిల్ 29 – 2020 మే 29) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[3] ఆయన 2000 నుండి 2003 వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అజిత్ జోగి ఐపీఎస్, ఐఏఎస్కు ఎంపికై 1981 నుండి 1985 వరకు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తించాడు.[4]
అజిత్ జోగి | |
---|---|
వ్యక్తిగత వివరాలు | |
జననం | [1][2] | 1946 ఏప్రిల్ 29
మరణం | 2020 మే 29 74) రాయ్పూర్, ఛత్తీస్గఢ్, భారతదేశం | (వయసు
సంతానం | అమిత్ జోగి |
నివాసం | రాయ్పూర్ |
అజిత్ జోగి 1946 ఏప్రిల్ 29న మధ్యప్రదేశ్ రాష్ట్రం, భిలాస్పూర్ జిల్లాలోని జోగిసర్లో కాశీ ప్రసాద్ జోగి, కాంతిమణి దంపతులకు జన్మించాడు. ఆయన భోపాల్ లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అజిత్ జోగి 1967లో రాయ్పూర్ లోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశాడు.
అజిత్ జోగికి మే 9న గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు రాయ్పూర్ లోని శ్రీనారాయణ ఆస్పత్రికి తరలించగా, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో 2020 మే 29న మరణించాడు.[10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.