భీమ్బేట్కా శిలా గుహలు
From Wikipedia, the free encyclopedia
22°56′14″N 77°36′45″Eభీమ్బేట్కా శిలా గుహలు ప్రాచీన శిలా యుగం (పేలియోలిథిక్) నాటి పురావస్తు గుహలు. ఈ గుహలు భారతదేశంలో ఆదిమానవుడి ఉనికి తెలియజేస్తున్నాయి, ఈ రకముగా దక్షిణ ఆసియా రాతి యుగం ఆరంభాన్ని కూడా చాటుతున్నాయి. ఈ గుహలు భారతదేశం లోని మధ్యప్రదేశ్ రాష్ట్రం రైసేన్ జిల్లా అబ్దుల్లాగన్జ్ పట్టణానికి సమీపంలోని రతపాని వన్యప్రాణి అభయారణ్యంలో ఉన్నాయి.ఇందులో కొన్ని గుహలో 1,00,000 (1 లక్ష) సంవత్సరాలకు పూర్వం హోమో ఎరక్టస్ అనే ఆది మానవ జాతి నివసించారు.[1][2] ఈ గుహలలోని కొన్ని రాతి గుహ చిత్రాలు 30,000 సంవత్సరాలకు పై బడినవి.[3] ఈ గుహలు పూర్వం నాట్యం యొక్క ఉనికి కూడా కనబర్చాయి. 2003 లో ఈ గుహలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ఆమోదించబడింది.
భీమ్బేట్కా శిలా గుహలు | |
---|---|
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు | |
రకం | సాంస్క్రతిక |
ఎంపిక ప్రమాణం | (iii)(v) |
మూలం | 925 |
యునెస్కో ప్రాంతం | దక్షిణ ఆషియా |
శిలాశాసన చరిత్ర | |
శాసనాలు | 2003 (27th సమావేశం) |
బీమ్ బేట్కా (भीमबेटका) అనే పేరు మహా భారతంలోని భీముడు వలన వచ్చింది.[4] భీంబేట్కా అనే పదం భీమ్బౌట్కా (भीमबैठका) నుంచి వచ్చింది అంటే భీముడు కూర్చున్న ప్రదేశం.[4]