సుగంధ ద్రవ్యం
వంటకాలకు ప్రత్యేక రుచిని సంతరించుటకు మొక్కల భాగాల నుండి తయారు చేయబడే పదార్థాలు (దినుసులు) / From Wikipedia, the free encyclopedia
సుగంధ ద్రవ్యాలు వంటకాలకు ప్రత్యేక రుచిని సంతరించుటకు మొక్కల భాగాల నుండి తయారు చేయబడే పదార్థాలు (దినుసులు). వీటిని ఉష్ణమండల సుగంధ మొక్కల బెరడు, విత్తనాలు, వేర్లు, పండ్లు, గింజల నుండి తయారు చేస్తారు. కొన్ని సుగంధ ద్రవ్యాలను చాలా అస్పష్టమైన, మృదువైన మొక్క కణజాలంతో తయారు చేస్తారు. మొక్కల ఆకులు, పువ్వులు, కొమ్మల నుండి తయారు చేసిన దినుసులను మూలికలుగా వ్యవహరిస్తారు. సాధారణంగా సుగంధ ద్రవ్యాలు బలమైన రుచి కలిగియుంటాయి. వాటిని ఎండబెట్టి ఉపయోగిస్తారు. ప్రస్తుత సుగంధ ద్రవ్యాలు, మూలికలు మానవ నాగరికత ప్రారంభం నుండే ఉపయోగించబడుతున్నాయి. ఎప్పుడు మానవులూ సుగంధ ద్రవ్యాల ప్రభావానికి ఆకర్షించబడినారో, అపుడు వివిధ మొక్కల భాగాల నుండి వివిధ సుగంధ ద్రవ్యాలను తీయడం ప్రారంభించారు. ఆసక్తికరంగా, మానవులు ఆకర్షించే ఈ ద్రవ్యాలలో కొన్ని ప్రకృతిలో విషంతో లేదా జంతువుల వ్యతిరేక వికర్షకాలతో కూడి ఉన్నవి.