శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్
భారతీయ రచయత / From Wikipedia, the free encyclopedia
శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్ లేదా శరత్చంద్ర చట్టోపాధ్యాయ్ (బెంగాలీ: শরত্চন্দ্র চট্টোপাধ্যায়) (1876 సెప్టెంబరు 15 - 1938 జనవరి 16) ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ నవలా రచయితా, కథా రచయితా. ఆయన నవలలు తెలుగునాట కూడా ప్రభంజనంలా ప్రాచుర్యం పొందాయి. సమాజాన్ని, వ్యక్తినీ లోతుగా అధ్యయనం చేసి సృష్టించిన ఆయన పాత్రలు, నవలలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగునాట నవలగా, చలన చిత్రంగా సంచలనం సృష్టించిన దేవదాసు ఆయన నవలే. చక్రపాణి మొదలైన అనువాదకులు ఆయనను తెలుగు వారికి మరింత దగ్గర చేసారు. చివరకు కొందరు పాఠకులు శరత్ బాబు తెలుగువాడేనని భావించేవారంటే, తెలుగులో ఆయన ప్రాచుర్యం ఎంతటిదో తెలుసుకోవచ్చు.
త్వరిత వాస్తవాలు శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్শরত্চন্দ্র চট্টোপাধ্যায়, పుట్టిన తేదీ, స్థలం ...
శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్ শরত্চন্দ্র চট্টোপাধ্যায় | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | (1876-09-15)1876 సెప్టెంబరు 15 దేబానందపూర్, హుగ్లీ, బెంగాల్, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1938 జనవరి 16(1938-01-16) (వయసు 61) కలకత్తా,బెంగాల్, బ్రిటిష్ ఇండియా |
కలం పేరు | దేవి అనిలా |
వృత్తి | రచయిత |
జాతీయత | భారతీయుడు |
పౌరసత్వం | భారతీయుడు |
కాలం | 19 వ శతాబ్దం |
రచనా రంగం | నవలలు |
సాహిత్య ఉద్యమం | బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము |
మూసివేయి