వేటూరి ప్రభాకరశాస్త్రి
తెలుగు రచయిత / From Wikipedia, the free encyclopedia
వేటూరి ప్రభాకరశాస్త్రి, (ఫిబ్రవరి 7, 1888 - ఆగష్టు 29, 1950) తెలుగు కవి, భాష పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, రేడియో నాటక రచయిత, తెలుగు, సంస్కృత పండితుడు.[1] చరిత్రలో లభ్యమౌతున్న మొట్టమొదటి తెలుగు పదము నాగబు అని కనుగొన్నది ఈయనే. సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి చిహ్నం. వేటూరి ప్రభాకరశాస్త్రి గారి వంటి వ్యక్తి ప్రపంచ సాహితీ చరిత్రకు ప్రకాశము వంటి వారు. ఆయన వట్టి మేధావి కాదు..తెలుగు భాషా, చారిత్రక సాహిత్య నిర్మాణానికి అక్షరాలు మోసిన కూలీ! ఆయన వట్టి రచయిత కాదు..విమర్శనా వ్యాస రచనకు ఆద్యుడు. పన్నెండో ఏటే పరభాషలో కవితా సుమాలు వెదజల్లిన అనన్యుడు. ఈయన తెలుగుభారతీ సంతానములో చిరస్మరణీయులు, తెలుగువారికి ప్రాతఃస్మరణీయులు.
త్వరిత వాస్తవాలు వేటూరి ప్రభాకరశాస్త్రి, పుట్టిన తేదీ, స్థలం ...
వేటూరి ప్రభాకరశాస్త్రి | |
---|---|
![]() వేటూరి ప్రభాకరశాస్త్రి | |
పుట్టిన తేదీ, స్థలం | ఫిబ్రవరి 7, 1888 పెదకళ్ళేపల్లి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
మరణం | ఆగష్టు 29, 1950 |
జాతీయత | భారతీయుడు |
పౌరసత్వం | భారతదేశం |
సంతకం | ![]() |
మూసివేయి