![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/aa/Vizag_Montage_2018.jpg/640px-Vizag_Montage_2018.jpg&w=640&q=50)
విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద నగరం / From Wikipedia, the free encyclopedia
విశాఖపట్నం భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద నగరం, అదే పేరుగల జిల్లాకు కేంద్రం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవాహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సముద్రం లోకి చొచ్చుకొని ఉన్న కొండ "డాల్ఫిన్ నోస్", అలల తాకిడిని తగ్గించి సహజ సిద్ధమైన నౌకాశ్రయానికి అనుకూలంగా ఉంది. విశాఖపట్నానికి విశాఖ, వైజాగ్, వాల్తేరు అనే పేర్లు కూడా ఉన్నాయి.
విశాఖపట్నం
విశాఖ, వైజాగ్, వాల్తేరు, | |
---|---|
![]() పైనుండి క్రిందికి, ఎడమనుండి కుడికి, ఆర్కె బీచ్, నౌరోజీ రహదారి, సింహాచల దేవాలయం, కైలాసగిరిలో శివపార్వతిల విగ్రహాలు, కింగ్ జార్జి ఆసుపత్రి, ఓడరేవు సమీపంలోని విశాఖ పారిశ్రామికవాడ, తెన్నేటి ఉద్యానవనం దగ్గర తీర రహదారి | |
Nickname(s): విధిగల నగరం (The City of Destiny), తూర్పుతీర రత్నం (The Jewel of the East Coast) | |
Coordinates: 17°42′15″N 83°17′52″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం, |
పట్టణంగా గుర్తించింది | 1865 |
నగరంగా గుర్తించింది | 1979 |
Government | |
• Type | నగరపాలక సంస్థ |
• Body | మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ, విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ |
• మేయర్ | గొలగాని హరివెంకట కుమారి |
విస్తీర్ణం | |
• మహానగరం | 697.96 కి.మీ2 (269.48 చ. మై) |
• Metro | 4,983 కి.మీ2 (1,924 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మహానగరం | 17,28,128 |
• Rank | భారతదేశంలో జనాభా ర్యాంకు 11 |
• జనసాంద్రత | 2,500/కి.మీ2 (6,400/చ. మై.) |
• Metro | 56,18,000 |
Demonym(s) | వాల్తేరోడు, వైజాగీయుడు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 530 0XX, 531 1XX |
ప్రాంతీయ ఫోన్కోడ్ | +91-891 |
వాహనాల నమోదు సూచిక సంఖ్యలు | AP-31, AP-32, AP-33, AP-34 , AP-39 |
అధికారిక | తెలుగు |
2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రతిపాదించాడు.[3] [4]
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం, బౌద్ధ విహారాల అవశేషాలున్న తొట్లకొండ, బావికొండ, పావురాల కొండ, బొజ్జన కొండ; సముద్రతీర ప్రాంతాలు, ఉద్యానవనాలు, ప్రదర్శనశాలలు ఇక్కడి ప్రముఖ పర్యాటక ఆకర్షణలు. సరిహద్దు జిల్లాలలో గల పర్యాటక ప్రాంతాలైన అరకు లోయ, మన్యం అడవులు, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు చూడటానికి ఇది ప్రముఖ పర్యాటక కేంద్ర స్థావరం.