వింధ్య పర్వతాలు
మధ్య భారతంలో ఉన్న పర్వతాలు / From Wikipedia, the free encyclopedia
వింధ్య పర్వతాలు లేదా వింధ్య పర్వత శ్రేణి (ఆంగ్లం : Vindhya Range), (సంస్కృతం विन्ध्य ) పశ్చిమ మధ్య భారత ఉపఖండంలో గల పర్వతశ్రేణులు. ఈ పర్వత శ్రేణులు ఉత్తరభారత్, దక్షిణ భారత్ విడదీస్తున్నాయి. ఇవి అతి ప్రాచీన ముడుత పర్వతా శ్రేణులు.
ఈ పర్వతశ్రేణులు ప్రధానంగా మధ్యప్రదేశ్లో గలవు. వీటి పశ్చిమ భాగాలు గుజరాత్ లోనికి తూర్పుభాగాలలో (గుజరాత్ ద్వీపకల్పంలో) చొచ్చుకుపోయి ఉన్నాయి. వీటి తూర్పు భాగాలు మిర్జాపూర్ వద్దగల గంగానది వరకూ వ్యాపించియున్నాయి.
వీటి దక్షిణ వాలులు నర్మదా నది, అరేబియా సముద్రం వరకూ వ్యాపించియున్నవి.