నరసింహావతారం
From Wikipedia, the free encyclopedia
నరసింహావతారం, శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారాన్ని వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
త్వరిత వాస్తవాలు నరసింహావతారం, దేవనాగరి ...
నరసింహావతారం | |
---|---|
రక్షించే భగవంతుడు | |
దేవనాగరి | नरसिंह |
సంస్కృత అనువాదం | Narasiṁha |
అనుబంధం | విష్ణువు దశావతారాలలో నాల్గవది |
నివాసం | వైకుంఠం |
ఆయుధములు | చక్రం, గద, గోళ్ళు |
భర్త / భార్య | నారసింహి |
మూసివేయి
స్వామి ప్రార్థనలలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి శ్లోకం:
- ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
- మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్ |
- వామేతరేణ వరదాభయ పద్మ చిహ్నం
- లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ||
ప్రార్థన శ్లోకం:
- సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
- యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
- త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
- ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే||