రాధాకుమారి
నటి / From Wikipedia, the free encyclopedia
రాధాకుమారి (Radha Kumari) తెలుగు సినిమా నటి. ఈమె ప్రముఖ రచయిత, సినీ నటుడు రావి కొండలరావు గారి సతీమణి. గయ్యాళితనం, సాత్వికత్వం ఇవి రెండూ కలబోసిన పాత్రల్లో నటించి మెప్పించారు. సహాయనటిగా, హాస్యనటిగా తెలుగు తెరపై తనదైన ముద్రవేసారు. ఇప్పటి వరకు ఈమె సుమారు 400కి పైగా సినిమాలలో నటించి అందరి మన్ననలు పొందింది.కేవలం చలనచిత్రాల్లోనే కాకుండా పలు ధారావాహికల్లోను నటించారు. అనువాద కళాకారిణిగానూ ఆమె వంద సినిమాలకు పనిచేసారు.
త్వరిత వాస్తవాలు రాధాకుమారి, జననం ...
రాధాకుమారి | |
---|---|
![]() | |
జననం | రాధాకుమారి |
మరణం | మార్చి 8, 2012 |
జీవిత భాగస్వామి | రావి కొండలరావు |
మూసివేయి
ఈమె మొదటిసారిగా ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో అందరూ నూతన తారలతో తయారైన తేనె మనసులు (1965) సినిమాలో నటించింది. ఈ చిత్రంలో 20 ఏళ్ళ వయసులో హీరో కృష్ణ కు సవతి తల్లిగా నటించి మెప్పించింది.
కొంతకాలం విరామం తర్వాత మరల 2002 నుండి తిరిగి డి. రామానాయుడు పిలుపు మేరకు నువ్వు లేక నేను లేను తో సినిమాలలో నటించడం ప్రారంభించారు.