రమణీయం
From Wikipedia, the free encyclopedia
ఎ.యస్. రామశాస్త్రి వ్రాసిన తెలుగు కథల పుస్తకం రమణీయం . అనామకుడు అనే కలం పేరుతొ వ్రాసాడు. ఈ పుస్తకంలో ఆలుమగల దాంపత్య కాలచక్రం గురించి కవి రమణీయంగా వివరించాడు. ఏడాదికి ఆరు ఋతువులు వున్నట్టే ఆలుమగల దాంపత్య కాలచక్రంలోనూ వుంటాయని, పెళ్ళి, సంతోషం, సంసారం, సంగరం, సంతానం, సంతృప్తి అనే మజిలీల మీదుగా - కామం పెరిగి, విరిగి, తరిగి నిష్కామభరితమైన స్నేహంగా, ప్రేమగా యెలా పరివర్తనం చెందుతుందో కవి మనకు ఈ పుస్తకం ద్వారా చెప్పాడు. నిన్న కన్న బిడ్డ ఇవాళ పిల్లలవుతారు, ఇవ్వాల పిల్లలు - రేపటికి తల్లిదండ్రులు, ఎల్లుండికి తాతలూ, అవ్వలూ అవుతారు కవి మనకు రమణీయంలో ఈ కాలచక్రాన్ని సీత, రామం పాత్రల రూపంలో మనకు కళ్లకు కట్టినట్లు రమణీయంగా చెప్పాడు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/1/14/Ramaneeyam.jpg)