మౌనం
From Wikipedia, the free encyclopedia
కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకమ్, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయమ్. మౌనం అనగా వాక్కుని నియంత్రించడం; లేదా మాటలాడడం తగ్గించడం. ఇదొక అపుర్వమైన కళ, తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా దైవమిచ్చిన వరంగా భావించి ముక్తసరిగా అవసరం మేరకే మాట్లాడటం సర్వదా శ్రేయస్కరం. వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.పాపాల పరిహారార్ధం నిర్దేశించబడిన ఐదు శాంతులలో మౌనం ఒకటి. ఈ పంచ శాంతులు: ఉపవాసం, జపం, మౌనం, పశ్చాత్తాపం, శాంతి.మౌనంగా ఉండేవారిని మునులు అంటారు.మాట వెండి అయితే, మౌనం బంగారం అని సామెత.మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చుఅన్నారు స్వామి వివేకానంద.నేరనిర్థారణ సందర్భాల్లో నేరస్థుడు మౌనం వహిస్తే నేరం అంగీకరించిన భావం వస్తుంది కాబట్టి ఆ సమయంలో మౌనాన్ని ఆశ్రయించడం అనుకూలం కాదు.అతిగా మాట్లాడేవారికి విలువ తగ్గిపోతూ ఉంటుంది.
మౌనం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం మౌనం (అయోమయ నివృత్తి) చూడండి. |