మోక్షగుండం విశ్వేశ్వరయ్య
భారత ఇంజనీర్, పండితుడు, రాజనీతిజ్ఞుడు మరియు మైసూర్ దివాన్ / From Wikipedia, the free encyclopedia
మోక్షగుండం విశ్వేశ్వరయ్య - MV - (సెప్టెంబర్ 15, 1861 — ఏప్రిల్ 12, 1962), భారతదేశపు ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా పనిచేశాడు. 1955లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది. అతను ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ (Knight commander of the order of Indian empire (KCIE)) బిరుదునిచ్చి సత్కరించాడు. భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబరు 15ను ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. మైసూరులో గల ఆనకట్ట కృష్ణరాజ సాగర్ కు అతను ఛీఫ్ ఇంజనీరుగా పనిచేశాడు. హైదరాబాదును మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించాడు.
త్వరిత వాస్తవాలు మైసూరు రాజ్య దివాను, చక్రవర్తి ...
సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య KCIE | |||
పదవీ కాలం 1912 – 1918 | |||
చక్రవర్తి | కృష్ణరాజ ఒడయార్ IV | ||
ముందు | టి. ఆనందరావు | ||
తరువాత | ఎం. కాంతరాజ్ అరస్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1861-09-15)1861 సెప్టెంబరు 15 ముద్దేనహళ్ళి చిక్కబళ్ళాపూర్ మైసూర్ రాజ్యం (ప్రస్తుత కర్ణాటక) | ||
మరణం | 1962 ఏప్రిల్ 14(1962-04-14) (వయసు 101) బెంగుళూరు | ||
జాతీయత | భారతీయుడు | ||
పూర్వ విద్యార్థి | COEP | ||
వృత్తి | ఇంజనీరు, దివాను | ||
వృత్తి | ఇంజనీరు | ||
మతం | హిందూ |
మూసివేయి