మాస్టర్ వేణు
సంగీత దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
మాస్టర్ వేణు (1916 - 8 సెప్టెంబర్, 1981) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఇతని అసలు పేరు మద్దూరి వేణుగోపాల్. వేణు మేనమామ అయినటువంటి రామయ్య నాయుడు గారి వద్దనే వాద్య సంగీతం నేర్చుకున్నారు. పదేళ్ళ వయసుకే ఈయన హార్మోనియం వాయించడంలో దిట్ట అయ్యాడు. 14వ యేట నుండే వేణు కచేరీలు ఇవ్వడం మొదలుపెట్టాడు. భీమవరపు నరసింహరావు గారి స్వరసారథ్యంలో వచ్చిన "మాలపిల్ల" సినిమాకి సహాయకునిగా అలాగే హార్మోనిస్ట్ గా పనిచేశాడు. బొంబాయిలో మనహర్ బార్వే నడుపుతున్న "స్కూల్ ఆఫ్ మ్యూజిక్"లో చేరి, ఆరు నెలలు తిరగకుండానే ఆ విద్యాలయంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు. అప్పట్నుంచే "మాస్టర్ వేణు" అయ్యాడు. వేణుకి నౌషాద్ స్వరపరిచిన గీతాలంటే ఎనలేని మక్కువ. 1946లో వేణు బొంబాయి నుంచి తిరిగి వచ్చి మద్రాసులో ఉన్న హెచ్.ఎం.వి కంపెనీలో రెండేళ్ళు పనిచేశాడు. అక్కడ చాలా ప్రైవేట్ పాటలు స్వరపరచాడు.
మాస్టర్ వేణు | |
---|---|
జననం | మద్దూరి వేణుగోపాల్ 1916 మచిలీపట్నం |
మరణం | 8 సెప్టెంబర్, 1981 |
వృత్తి | సంగీత దర్శకుడు |
పదవి పేరు | మాస్టర్ |
భార్య / భర్త | శకుంతలాదేవి |
పిల్లలు | ఇద్దరు కొడుకులు మూర్తి చందర్, భాను చందర్ |
విజయా వారు అమెరికా నుండి "హేమాండ్ ఆర్గాన్" అనే కొత్త వాద్యాన్ని ఆ రోజుల్లో పదహారు వేల రూపాయలకు ఆర్డర్ ఇచ్చి తెప్పించారు. ఈ వాద్యాన్ని అప్పట్లో వేణు తప్ప ఎవ్వరూ వాయించలేకపోయేవారు. ఆ వాద్యాన్ని "గుణసుందరి కథ", "పాతాళభైరవి", "మల్లీశ్వరి" తదితర చిత్రాల్లో ఉపయోగించాడు.