మాడపాటి హనుమంతరావు
రాజకీయ నాయకుడు, రచయిత / From Wikipedia, the free encyclopedia
మాడపాటి హనుమంతరావు (జనవరి 22, 1885 - నవంబరు 11, 1970) ప్రముఖ రాజకీయ నాయకుడు, రచయిత. హనుమంతరావు 20వ శతాబ్ది తొలిదశకంలో హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రాంతాల్లో (నేటి తెలంగాణ) ఆంధ్రోద్యమం వ్యాప్తిచేసేందుకు కృషిచేశారు. ఆయన చేసిన కృషికి గాను ఆంధ్ర పితామహుడు అన్న పేరును పొందారు. న్యాయవాద వృత్తిని చేపట్టిన మాడపాటి, విజయవంతమైన లాయరుగా పేరుపొందారు. తీరిక సమయాలన్నిటా ఆంధ్రోద్యమానికి, తెలంగాణాలో గ్రంథాలయాల అభివృద్ధికి కేటాయించేవారు. ఆంధ్రజనసంఘం, ఆంధ్రమహాసభ వంటి ప్రజాసంఘాల స్థాపనలోనూ, వాటి నిర్వహణలోనూ కీలకపాత్ర వహించారు. తర్వాతి తరం ప్రజానాయకులు వీరిని మితవాదిగా గుర్తించారు. అయితే నైజాం ప్రాంతంలో తర్వాతి తరం రాజకీయ నాయకత్వం ఏర్పడడానికి పునాదిగా వీరు చేసిన కృషి సార్థకమైనది. ఆయన ప్రజాహితరంగంలో, సాంస్కృతిక చైతన్యం కలిగించడంలో ఎంతో కృషిచేసినా చాలా కాలం వరకూ క్రియాశీలకమైన రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. 1952లో శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయరు పదివిని అధిష్టించారు.
మాడపాటి హనుమంతరావు | |
---|---|
జననం | మాడపాటి హనుమంతరావు జనవరి 22, 1885 కృష్ణా జిల్లా, నందిగామ తాలూకూ, పొక్కునూరు |
మరణం | నవంబరు 11, 1970 |
వృత్తి | న్యాయవాది |
ప్రసిద్ధి | కవి, రచయిత |
పదవి పేరు | ఆంధ్ర పితామహుడు |
మతం | హిందూమతం |
భార్య / భర్త | అన్నపూర్ణమ్మ మాణిక్యమ్మ |
పిల్లలు | లక్ష్మిబాయి సుకుమార్ |
తండ్రి | వెంకటప్పయ్య |
తల్లి | వెంకట సుబ్బమ్మ |
Notes ఆంధ్ర పితామహునిగా పేరుగాంచారు. |