మచిలీపట్నం ముట్టడి
1759 లో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న మచిలీపట్నంను ముట్టడించి ఆక్రమించుకున్న యు / From Wikipedia, the free encyclopedia
బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న మచిలీపట్నం పట్నాన్ని ముట్టడించి ఆక్రమించుకోవడాన్ని మచిలీపట్నం ముట్టడి అంటారు. మచిలీపట్నాన్ని ఐరోపా దేశాల వారు అ రోజుల్లో మసూలిపటం అనేవారు. అందుచేత దీన్ని మసూలిపటం ముట్టడి (Siege of Masulipatam) అని కూడా అంటారు. 1759 మార్చి 6 న మొదలైన ముట్టడి ఏప్రిల్ 7 న బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి విజయంతో ముగిసింది. దీంతో ఉత్తర సర్కారుల నుండి ఫ్రెంచి వారి నిష్క్రమణ సంపూర్ణమైంది. బ్రిటిషు సైన్యానికి కలనల్ ఫ్రాన్సిస్ ఫోర్డు నాయకత్వం వహించగా, ఫ్రెంచి వారి తరపున కాన్ఫ్లాన్స్ వారిని ఎదుర్కొన్నాడు.