భారత పాక్ యుద్ధం 1971
From Wikipedia, the free encyclopedia
భారత్-పాకిస్తాన్ ల మధ్య అతి పెద్ద యుద్ధం 1971లో జరిగింది. ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ విమోచన ప్రధాన అంశంగా నిలిచింది. 1971 డిసెంబరు 3 సాయంత్రం మొదలయిన యుద్ధం డిసెంబరు 16, 1971 తేదీన పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో భారత సైన్యం, బంగ్లాదేశ్ సైన్యం కలసి కట్టుగా పాకిస్తాన్ సైన్యంతో పొరాడటం విశేషం.
భారత్ పాక్ యుద్ధం 1971 | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||
ప్రత్యర్థులు | |||||||||
భారత్ | పాకిస్తాన్ | ||||||||
సేనాపతులు, నాయకులు | |||||||||
శామ్ మానెక్షా జగ్జీత్ సింగ్ అరోరా జి.జి. బేవూర్ కె.పి. కాన్డెత్ | గుల్ హసన్ ఖాన్ అబ్దుల్ హమూద్ ఖాన్ టిక్కా ఖాన్ ఎ.ఎ.కె. నియాజి | ||||||||
బలం | |||||||||
500,000 సైనికులు | 365,000 సైనికులు | ||||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||||
3,843 మరణించారు[1] 9,851 గాయపడ్డారు[1] 1 ఫ్రిగేట్ 1 నావల్ ప్లేన్ | 9,000 మరణించారు[2] 4,350 గాయపడ్డారు 97,368 పట్టుబడ్డారు[3] 2 డిస్ట్రాయర్స్[4] 1 మైన్ స్వీపర్[4] 1 సబ్ మెరీన్[5][6] 3 పాట్రోల్ వెసెల్స్ 7 గన్ బోట్లు |
1971వ సంవత్సరపు భారత-పాకిస్తాన్ యుద్ధం, భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక సైనిక ఘర్షణ. డిసెంబరు 3, 1971న 11 భారతీయ వాయుసేనకు సంబంధించిన విమాన స్థావరాల పై పాకిస్తాన్ చేసిన అనుమాన ప్రేరిత దాడిని, ఆపరేషన్ చెంఘిజ్ఖాన్ అని పరిగణిస్తారు. ఈ అనుమాన ప్రేరిత దాడి యుద్ధానికి మొదలుగా నిలిచింది.[7][8] 13 రోజులు మాత్రమే నడిచిన ఈ యుద్ధాన్ని చరిత్రలోని అతి తక్కువ కాలం జరిగిన యుద్ధాలలో ఒకటిగా గుర్తిస్తారు.[9][10]
యుద్ధం జరుగుతోన్న సమయంలో, భారత, పాకిస్తానీ బలగాలు, తూర్పు, పడమటి దిశలలో ఘర్షణ పడ్డారు. తూర్పు కమాండ్కు చెందిన పాకిస్తానీ సైనిక బలగాలు లొంగుబాటు పత్రం పై సంతకాలు చేసాక, యుద్ధం అంతమయ్యింది. ఈనాటి వరకూ కూడా, బహిరంగ లొంగుబాటులలో ఇది మొదటిదీ బహుశా ఆఖరుదీ[11] కూడా. [12] 1971 డిసెంబరు 16నాటి లొంగుబాటు తరువాత, తూర్పు పాకిస్తాన్, స్వతంత్ర బంగ్లాదేశ్గా విడిపోయింది. తూర్పు పాకిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో తూర్పు పాకిస్తాన్లో ఉన్న సుమారు 97,368 పశ్చిమ పాకిస్తానీ వాసులను, భారతదేశము యుద్ధ ఖైదీలుగా అదుపులోకి తీసుకుంది. అందులో 79,700 మంది పాక్ సైన్యానికి చెందిన సైనికులు, పారామిలిటరి సిబ్బంది[13], మరో 12,500 మంది నాగరికులు[13] ఉన్నారు.