భారత పాక్ యుద్ధం 1965
From Wikipedia, the free encyclopedia
భారత్ పాకిస్తాన్ల సరిహద్దుల వద్ద జరిగిన చిన్న తగాదాలు తారస్థాయికి చేరుకోవడంతో భారత్ పాక్ యుద్ధం ప్రారంభమైంది. 1965లో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్దాన్ని రెండవ కాశ్మీర్ యుద్దం అని కూడా అంటారు. మొదటి కాశ్మీర్ యుద్ధం 1947లో జరిగింది. పాకిస్తాన్ తలపెట్టిన ఆపరేషన్ జిబ్రాల్టర్ యుద్దానికి మూల కారణంగా పేర్కొనవచ్చు. ఈ చర్య ముఖ్య ఉద్దేశం భారత్ కు వ్యతిరేకంగా కాశ్మీరులోకి తీవ్రవాదులను చొప్పించడం. ఐదు వారాల పాటు జరిగిన యుద్దంలో ఇరు వైపుల వేలాది మంది సైనికులు చనిపోయారు. చివరికి ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్దం ముగిసింది. ఈ యుద్దం చాలా వరకు నేల మీదే జరిగింది. కాశ్మీరులో భారీ యెత్తున బలగాలను మొహరించారు. వాయు, నావికా దళాల నుంచీ కూడా అవసరమైన సహకారం అందింది. అన్ని భారత్ పాక్ యుద్దాల లాగే ఈ యుద్ధానికి సంబంధించి కూడా చాలా విషయాలు వెలుగు లోకి రాలేదు.
భారత్ పాక్ యుద్ధం 1965 | |||||||
---|---|---|---|---|---|---|---|
| |||||||
ప్రత్యర్థులు | |||||||
భారత్ | పాకిస్తాన్ | ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
జొయన్తో నాత్ చౌదరి హర్ బక్ష్ సింగ్ గుర్ బక్ష్ సింగ్ | ఆయుబ్ ఖాన్ మూసా ఖాన్ టిక్కా ఖాన్ నాసిర్ అహ్మద్ ఖాన్ | ||||||
బలం | |||||||
~150 యుద్దవిమానాలు | |||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
తటస్థ వ్యక్తుల లెక్కలు [2][3]
భారతదేశ లెక్కలు
పాకిస్తాన్ లెక్కలు
| తటస్థ వ్యక్తుల లెక్కలు [2]
పాకిస్తాన్ లెక్కలు
భారతదేశ లెక్కలు
|