భారతీయ రిజర్వ్ బ్యాంక్
బ్యాంకుపై Rbi నియంత్రణపై పరశీలన / From Wikipedia, the free encyclopedia
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) (ఆగ్లం: Reserve Bank of India) భారతదేశపు కేంద్ర బ్యాంకు. ఈ బ్యాంకును 1935 ఏప్రిల్ 1న భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 ప్రకారము స్థాపించారు. స్థాపించబడినప్పటి నుంచి దీని ప్రధాన స్థావరం కోల్కతలో ఉండేది. తర్వాత ముంబాయి నగరానికి మార్చబడింది. ప్రారంభంలో ఇది ప్రైవేటు అజమాయిషిలో ఉన్ననూ 1949లో జాతీయం చేయబడిన తర్వాత భారత ప్రభుత్వం అధీనంలోకి వచ్చింది. రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంకుకు అధిపతి గవర్నర్. ఇతనిని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అని పిలుస్తారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సాధారణంగా ఆర్థిక నైపుణ్యం కల వ్యక్తులను ఈ బ్యాంకు అధిపతులుగా నియమిస్తారు.మన్మోహన్ సింగ్ గతంలో రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్ గా పనిచేసాడు. రిజర్వ్ బ్యాంకు ప్రస్తుత గవర్నరు శక్తికాంత దాస్, ఊర్జిత్ పటేల్ నుండి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.