గణతంత్ర భారత రాజకీయ సభ From Wikipedia, the free encyclopedia
భారత పార్లమెంటు, (లేదా సంసద్) భారతదేశ అత్యున్నత శాసనమండలి. ఇందులో రాష్ట్రపతి, రెండు సభలు ఉన్నాయి, ఒకటి లోక్సభ, రెండవది రాజ్యసభ. ఇది భారత రాజధాని ఢిల్లీ లోని సంసద్ మార్గ్లో గలదు.[1] భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. కొత్త రాజ్యాంగం ప్రకారం మొదటి సాధారణ ఎన్నికలు 1951-52 సంవత్సరంలో జరిగాయి, మొదటి ఎన్నికైన పార్లమెంటు 1952 ఏప్రిల్లో ఉనికిలోకి వచ్చింది. రాష్ట్రపతి, ఉభయ సభలతో కూడిన ఉభయసభలను రాష్ట్రాల మండలి (రాజ్యసభ), హౌస్ ఆఫ్ పీపుల్ (లోక్సభ) అని పిలుస్తారు.[2]
భారత పార్లమెంటు | |
---|---|
రకం | |
రకం | ద్వి సభ |
సభలు | రాజ్యసభ లోక్ సభ |
నాయకత్వం | |
ద్రౌపది ముర్ము 2022 జూలై 25 నుండి | |
మెజారిటీ నాయకుడు (లోక్ సభ) | |
మెజారిటీ నాయకుడు (రాజ్యసభ) | |
నిర్మాణం | |
సీట్లు | 788 (245 రాజ్యసభ + 543 లోక్ సభ) |
లోక్ సభ రాజకీయ వర్గాలు | అధికారిక: ఎన్ డి ఎ ప్రతిపక్షాలు: యూపీఎ, మూడవ ఫ్రంట్, ఇతరులు |
రాజ్య సభ రాజకీయ వర్గాలు | యూపీఎ (మెజారిటీ), ఎన్ డి ఎ (రెండవ), ఇతరులు : మూడవ ఫ్రంట్ |
ఎన్నికలు | |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
లోక్ సభ చివరి ఎన్నికలు | 16 జనవరి, 23 మార్చి, 21 జూన్ 2018 |
రాజ్య సభ చివరి ఎన్నికలు | 11 ఏప్రిల్ – 19 మే 2019 |
లోక్ సభ తదుపరి ఎన్నికలు | మే, జూన్ 2019 |
రాజ్య సభ తదుపరి ఎన్నికలు | May 2024 |
సమావేశ స్థలం | |
సంసద్ భవన్ | |
వెబ్సైటు | |
parliamentofindia.nic.in |
సంసద్ అనే పదము సంస్కృతానికి చెందింది, దీని అర్థం ఇల్లు లేక భవనం.
పార్లమెంటు భవనం (సంసద్ భవన్), ఈ భవనాన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ "హెర్బర్ట్ బేకర్" 1912-13 లో డిజైన్ చేశాడు. 1921 నుండి ఆరేళ్ళ పాటు దీని నిర్మాణం కొనసాగింది. ఈ వృత్తాకార భవనానికి 83 లక్షల ఖర్చు అయింది. దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. 1927 జనవరి 18న గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దీన్ని మ్యూజియంగా మార్చనున్నారు.[3]
రిపబ్లిక్ అధ్యక్షుడిని పార్లమెంటు ఉభయ సభలలో ఎన్నుకోబడిన, రాష్ట్రాల శాసనసభల (ప్రసిద్ధ సభలు) ఎన్నుకోబడిన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ ద్వారా ఎన్నుకోబడతాడు. భారత రాష్ట్రపతి పార్లమెంటులో ఒక భాగమైనప్పటికీ, రాష్ట్రపతి ఉభయ సభలలో దేనిలోనూ కూర్చోడు లేదా చర్చలలో పాల్గొనడు. పార్లమెంటుకు సంబంధించి రాష్ట్రపతి నిర్వర్తించాల్సిన కొన్ని రాజ్యాంగ విధులు ఉన్నాయి.
లోక్ సభ ను, ప్రజాసభ లేదా దిగువసభ అని అంటారు. దీనిలోని సభ్యులంతా దాదాపు ప్రజలచేత ఎన్నుకోబడినవారే. ఇది అత్యంత శక్తివంతమైన సభ. ఈ సభలో భారత రాజ్యాంగం ఆర్టికల్ 81 ప్రకారం 552 సభ్యులుండవచ్చును. దీని కాలపరిమితి 5 సంవత్సరాలు. దీనిని, దీని కాలపరిమితి తీరకముందే రద్దు పరచవచ్చును. ఈ నిర్ణయం భారత రాష్ట్రపతి తీసుకుంటారు. ఈ సభలో ప్రవేశమునకొరకు అభ్యర్థి, భారత పౌరుడై, 25 యేండ్లు నిండి, ప్రజలచే ఎన్నుకోబడి ఉండాలి. ప్రస్తుతం లోక్ సభలో 543 మంది సభ్యులున్నారు. 530 మంది రాష్ట్రాలనుండి, 13 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుండి కలరు.[5]
రాజ్యసభను "రాజ్యాంగ పరిషత్తు" అని లేదా "ఎగువ సభ" అని కూడా అంటారు. దీని సభ్యులు భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలచే ఎన్నుకోబడతారు. అనగా పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసన సభ్యులు వీరిని ఎన్నుకుంటారు. రాజ్యసభలో 250 మంది సభ్యులు గలరు. ఈ సభ ఎన్నటికీ రద్దు గాదు. ప్రతి సభ్యుడు 6 సంవత్సరాల కాలపరిమితి కొరకు ఎన్నుకోబడతాడు.[4] ఈ సభలో రెండేండ్లకొకసారి, మూడవవంతు సభ్యులు ఎన్నుకోబడతారు. ఈ విషయం భారత రాజ్యాంగం ఆర్టికల్ 80 లో వివరింపబడింది.
రాష్ట్రాలనుండి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల జనాభాపై ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్ నుండి 31 సభ్యులుంటే, నాగాలాండ్ నుండి కేవలం ఒక్కరే. ఈ సభలో సభ్యత్వం పొందడానికి కనీస వయస్సు 30 సంవత్సరాలు.
పార్లమెంటులోని ప్రతి సభకు ఒక నాయకుడు ఉంటాడు. లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిగా ఉన్న ప్రధానమంత్రి, లోక్సభ సభ్యుడు కానప్పుడు తప్ప లోక్సభలో సభా నాయకుడిగా వ్యవహరిస్తారు. ఒక సందర్భంలో, ప్రధానమంత్రి లోక్సభ సభ్యుడు కానప్పుడు, లోక్సభలో సభా నాయకుడిగా లోక్సభ సభ్యుడైన మంత్రిని నియమిస్తాడు/నామినేట్ చేస్తాడు. రాజ్యసభ సభ్యుడైన అత్యంత సీనియర్ మంత్రిని ప్రధానమంత్రి రాజ్యసభలో సభా నాయకుడిగా నియమిస్తారు.
పార్లమెంటులోని ప్రతి సభకు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుల జీతాలు, భత్యాల చట్టం, 1977 'ప్రతిపక్ష నాయకుడు' అనే పదాన్ని రాజ్యసభ లేదా లోక్సభ సభ్యునిగా నిర్వచించింది, ప్రస్తుతానికి ఆ పార్టీ సభకు నాయకుడు. అత్యధిక సంఖ్యా బలం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకత, రాజ్యసభ ఛైర్మన్ లేదా లోక్సభ స్పీకర్ ద్వారా గుర్తింపు పొందడం.
సాధారణంగా, ఒక సంవత్సరంలో మూడు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి: (i) బడ్జెట్ సెషన్ (ఫిబ్రవరి-మే); (ii) వర్షాకాల సమావేశాలు (జూలై-ఆగస్టు), (iii) శీతాకాల సమావేశాలు (నవంబరు-డిసెంబరు).
పాత పార్లమెంట్ భవనంలో మీటింగ్ హాల్స్ కొరత, భవనంలో మార్పులు చేరిస్తే భవన నిర్మాణం దెబ్బతినడం, భూకంపాన్ని తట్టుకునే సామర్థ్యం లేకపోవడం, అగ్ని ప్రమాదాలను ఎదుర్కునే ఆధునిక సౌకర్యాలు లేకపోవడం వలన కొత్త భవనాన్ని నిర్మించారు. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ 28-05-2023 న ప్రారంభించాడు.[6][7] అలాగే సెంగోల్ను లోక్సభ స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ కుర్చీకి కుడివైపున ప్రతిష్ఠించాడు.[8][9]. అంతేకాకుండా భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చి 75 సంవత్సరములు పూర్తీ చేసుకున్న సందర్భముగా రూ. 75 స్మారక నాణేన్ని కూడా విడుదల చేసాడు.[10] త్రిభుజాకారంలో ఉన్న కొత్తభవనం ముద్రించి ఉన్న స్టాంపు, కవర్ ని విడుదల చేసాడు.
త్రిభుజాకారంలో ఉన్న ఈ భవనాన్ని సెంట్రల్ విస్టా డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రెండున్నర సంవత్సరాలలో నిర్మించింది. దీనిని ఆర్కిటెక్ బిమల్ పటేల్ నేతృత్వంలో నిర్మించారు. ప్రస్తుత పార్లమెంట్ భవనం పక్కనే నిర్మించిన ఈ కొత్త భవనంలో అతి పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ సదుపాయాలు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.