బీర్బల్
From Wikipedia, the free encyclopedia
రాజా బీర్బల్, Raja Birbal (1528-1586), అక్బర్ ఆస్థానం లోని "నవరత్నాలలో" ఒక రత్నం. అక్బరు రాజదర్బారు, ప్రభుత్వంలో ఒక మహామంత్రి కూడానూ. అక్బర్ ఇతడిని తన అనుంగునిగా, విశ్వాసపాత్రుడిగా పరిగణించి తన సలహాదారునిగా నియమించుకొన్నాడు. బీర్బల్ మహామేధావి, చతురుడు, హాస్యభరితుడు, తన సంబద్ధ చాతుర్యానికి, సున్నిత హాస్యానికి, అతిసున్నిత విమర్శకూ చక్కటి ఉదాహరణ. బీర్బల్ తో సంభాషించి గెలవడాని మహామహులు తంటాలు పడేవారు. అక్బర్ ఆస్థానంలోగల ఇంకో చతురుడు ముల్లా దో పియాజా, ఇతను తొట్రుపాటు గలవాడు. బీర్బల్ తొణికేవాడు గాదు. ఈ స్థిరత్వం ప్రజలకు ఇంకా ముగ్దుణ్ణి చేసేవి. అక్బర్ కాలంలో అక్బర్ తరువాత, అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాడు బీర్బల్ మాత్రమే నంటే అతిశయోక్తి గాదు. చరిత్రకూడా ఇతడికి సమోన్నత గౌరవమిచ్చి, సరియగు స్థానమిచ్చింది.