ప్రకాష్ పడుకోనె
From Wikipedia, the free encyclopedia
1955 జూన్ 10 న కర్ణాటకలో జన్మించిన ప్రకాశ్ పడుకోణె (Prakash Padukone) (Kannada/Konkani: ಪ್ರಕಾಶ್ ಪಡುಕೋಣೆ) భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 1980లో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గెల్చి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అతని విజయాలకు స్పందించిన భారత ప్రభుత్వం 1972 లో అర్జున అవార్డును, 1982లో పద్మశ్రీను బహుకరించింది.