బమ్మెర పోతన
సుప్రసిద్ధ తెలుగు కవి 15వ శతాబ్దం / From Wikipedia, the free encyclopedia
బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి అతని జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.
పోతన అనే పేరుతో ఉన్న ఫాంటు కొరకు, పోతన (ఫాంటు) చూడండి.