పెద్దాపుర సంస్థానం
From Wikipedia, the free encyclopedia
పెద్దాపురం పట్టణం పెదపాత్రుడు మహారాజుచే నిర్మించబడింది. క్షత్రియ కులస్థులైన వత్సవాయి కుటుంబంచే మూడువందల సంవత్సరాలు పరిపాలించబడింది. ఈ కుటుంబ పరంపర రాజా వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి బహదూర్ తో ప్రారంభమైంది. 1555 నుంచి 1607 వరకులో ఇతను పరిపాలించాడు. పెద్దాపురం కోట ఇతని హయాంలోనే నిర్మించబడింది. ఇతని తరువాత, ఇతని కుమారుడు రాయ జగపతి, తరువాత ఇతని కుమారులు తిమ్మ జగపతి, బలభద్ర జగపతి పరిపాలించారు.1785 కి పెద్దాపురం రాజ్యం అటు తోటపల్లి నుంచి ఇటు నగరం వరకు మొత్తం 585 గ్రామాలు, పట్టణాలుతో విరాజిల్లింది. 1791 నుంచి 1804 వరకు వత్సవాయి రాయ జగపతి పరిపాలించాడు. రాయ జగపతి మరణాంతరం, అతని ముగ్గురు భార్యలు అయిన లక్ష్మీ నరసయమ్మ, బుచ్చి సీతయమ్మ, బుచ్చి బంగారయమ్మలు పెద్దాపురం సంస్థానాన్ని ఒకరి తరువాత ఒకరు పరిపాలించిరి. రాయ జగపతి రెండవ భార్య అయిన బుచ్చి సీతాయమ్మ 1828 నుంచి 1838 వరకు పాలించింది. ఈవిడ రెండు ధర్మ సంస్థలు ( ట్రస్టులు), ఒకటి పెద్దాపురంలోను, మరియొకటి కత్తిపూడిలోను ప్రారంభించింది. ఈ రోజుకి కూడా అక్కడ పేదవారికి రెండు పూటలా అన్నదానం చేయబడుతుంది.
పెద్దాపురం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం పెద్దాపురం (అయోమయ నివృత్తి) చూడండి. |
?పెద్దాపురం ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17.08°N 82.13°E / 17.08; 82.13 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | తూర్పు గోదావరి |
జనాభా | 45,174 (2001 నాటికి) |
వత్సవాయి మహారాజు యొక్క ఆస్థానంలో ఏనుగు లక్ష్మణకవి, వేదుల సత్యనారాయణశాస్త్రి పోషించబడ్డారు. తరువాత వారసులు లేకపోవటం చేత, 1847 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించే వరకు, సూర్యనారాయణ జగపతి బహదూర్ ఏలిక సాగించెను. తరువాత బ్రిటిష్ వారు పెద్దాపురంను రెవెన్యూ డివిజన్ చేసి మున్సబు కోర్టు, లూథరన్ ఉన్నత పాఠశాల పెద్దాపురం నిర్మించారు.