పి.సుశీల
ప్రముఖ గాయని / From Wikipedia, the free encyclopedia
పి.సుశీల (పులపాక సుశీల) గాయకురాలు. సుశీల విజయనగరంలో 1935 నవంబరు 13న సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పి.ముకుందరావు క్రిమినల్ లాయరుగా పని చేసేవాడు. తల్లి శేషావతారం గృహిణి. సుశీల 1950 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమారంగతో సంబంధం ఉన్న ప్లేబ్యాక్ సింగర్. ఐదు జాతీయ పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకొన్న సుశీల, ఆమె గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల పైబడి సాగిన సినీ జీవితంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగ, సింహళ భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడింది. భాష ఏదయినా కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్చారణకి సుశీల పెట్టింది పేరు. 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో కన్నతల్లి) అనే సినిమాలో ఎదుకు అలత్తాయ్ అనే పాటను తన మొదటిసారిగా పాడింది. ఆమె శ్రీలంక చిత్రాలకు కూడా పాడింది. ఆమె మాతృభాష తెలుగు అయినప్పటికీ కొద్దిగా హిందీ, కన్నడ భాషలలో మాట్లాడగలదు. తమిళ భాషను తెలుగు మాట్లాడినంత సరళంగా మాట్లాడగలదు.
పి.సుశీల | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
ఇతర పేర్లు | గాన సరస్వతి, కన్నడ కోగిలె |
జననం | (1935-11-13) 1935 నవంబరు 13 (వయసు 88) |
మూలం | విజయనగరం, మద్రాస్ ప్రెసిడెన్సి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, భారత దేశము |
సంగీత శైలి | ప్లేబ్యాక్ గానం, కర్ణాటక సంగీతం |
వృత్తి | గాయని |
క్రియాశీల కాలం | 1952–ప్రస్తుతం వరకు |
వెబ్సైటు | psusheela.org |