ధృష్టద్యుమ్నుడు
మహాభారతం లో పాత్ర / From Wikipedia, the free encyclopedia
ధృష్టద్యుమ్నుడు ద్రుపదుని కుమారుడు. ద్రౌపది అన్న. ద్రుపదుడు చేసిన యజ్ఞంలో ద్రౌపదితో పాటు ధృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు. తన మిత్రుడు తనను అవమానించిన పాండవుల గురువు ద్రోణుని సంహరించేందుకు ద్రుపదుడు తపస్సు చేయగా వరం చేత ధృష్టద్యుమ్నుడు జన్మించాడు. ఇతడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుని హతమార్చి, తన తండ్రి ద్రుపదుని కోరికను నెరవేర్చాడు. తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా ద్రోణుడి కొడుకైన అశ్వత్థామ చేతిలో ఉపపాండవులతో పాటు మరణిస్తాడు.