తెలుగు అకాడమి
From Wikipedia, the free encyclopedia
ఉన్నత స్థాయిలో విద్యాబోధన వాహికగానూ, పాలనా భాషగా తెలుగును సుసంపన్నం చేసేందుకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 6, 1968 న తెలుగు అకాడమి [1][2]ని స్థాపించింది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. పి.వి.నరసింహరావు దీని వ్యవస్థాపక అధ్యక్షులు. దాదాపు రెండువేల పుస్తకాలు విడుదల చేసింది. ఏటా అచ్చేసే పాఠ్యపుస్తకాలు దాదాపు 25 లక్షలు. రాష్ట్ర విభజన తర్వాత సంస్థ విభజన సమస్యలతో బలహీనమైంది.