తుంగ నది
From Wikipedia, the free encyclopedia
తుంగ నది కర్ణాటక రాష్ట్రంలోని పవిత్ర నది. ఇది గంగమూల వద్ద పడమటి కనుమల లోని వరాహ పర్వతంపై పుట్టి చిక్క మగళూరు, షిమోగా జిల్లాల గుండా ప్రవహిస్తుంది. దీని పొడవు సుమారు 147 కిలోమీటర్లు. ఈ నది కూడ్లి వద్ద భద్ర నదితో కలుస్తుంది. అక్కడనుండి దీనిని తుంగభద్ర అని పిలుస్తారు. తరువాత తూర్పుగా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. ఈ నది నీరు స్వచ్ఛంగా తాగేందుకు మధురంగా ఉంటుందని చెబుతూ "గంగా స్నానం తుంగా పానం" అనే సామెత ఉంది.
త్వరిత వాస్తవాలు తుంగ నది, స్థానం ...
తుంగ నది | |
---|---|
తీర్థహళ్ళి వద్ద తుంగ నది | |
స్థానం | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | కర్ణాటక |
భౌతిక లక్షణాలు | |
మూలం | గంగ మూల |
• స్థానం | చిక్కమగళూరు జిల్లా, కర్ణాటక |
సముద్రాన్ని చేరే ప్రదేశం | తుంగభద్ర |
• స్థానం | కూడ్లి, భద్రావతి, కర్ణాటక |
పొడవు | 147 కి.మీ. (91 మై.)approx. |
మూసివేయి
గజనూరు వద్ద ఈ నదిపై ఒక ఆనకట్ట ఉంది. ఇది తుంగభద్ర నదిలో సంగమించాక, ఆ నదిపై హోస్పేట వద్ద ఒక పెద్ద ఆనకట్ట ఉంది.