టంగుటూరి ప్రకాశం
భారత రాజకీయవేత్త మరియు స్వాతంత్ర సమర యోధుడు,ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి / From Wikipedia, the free encyclopedia
టంగుటూరి ప్రకాశం పంతులు (1872 ఆగష్టు 23 – 1957 మే 20) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. 1940, 50 దశకాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.
త్వరిత వాస్తవాలు తరువాత, వ్యక్తిగత వివరాలు ...
టంగుటూరి ప్రకాశం | |||
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం అక్టోబరు 1, 1953—నవంబరు 15, 1954 | |||
తరువాత | బెజవాడ గోపాలరెడ్డి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | ఆగష్టు 23, 1872 | ||
మరణం | మే 20, 1957 | ||
జీవిత భాగస్వామి | హనుమాయమ్మ | ||
సంతానం | ఇద్దరు కుమారులు (టంగుటూరి హనుమంతరావుతో సహ) | ||
మతం | హిందూ |
మూసివేయి