జ్యోతిర్మఠం
From Wikipedia, the free encyclopedia
జ్యోతిర్మఠము అని పిలిచే బదరీనాధ్ ఆశ్రమం ఆది శంకరులు స్థాపించిన నాలుగు మఠాలలో ఒకటి. దీనిని ఉత్తరామ్నాయ మనీ, బదరికాశ్రమం అని కూడా అంటారు. దీన్ని జోషిమఠ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో జోషిమఠ్ పట్టణంలో ఉంది. సముద్రమట్టం నుండి 1875 మీ. ఎత్తులో ఉన్న ఈ పట్టణం అనేక హిమాలయ పర్వత శిఖరారోహణ యాత్రలు, ట్రెక్కింగు యాత్రలకు, బద్రీనాథ్ యాత్రకూ ప్రవేశ ద్వారం.