చారు మజుందార్
From Wikipedia, the free encyclopedia
సి.ఎం.గా సుప్రసిద్ధుడైన చారు మజుందార్ (1918 - జూలై 28, 1972) నక్సలైటు నాయకుడు, నక్సల్బరీ ఉద్యమ రూపశిల్పి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పార్టీకి సంస్థాపక ప్రధాన కార్యదర్శి. అతని ప్రేరణ వల్ల ఎంతో మంది యువకులు విప్లవోద్యమంలో చేరారు. కార్మికులతో, కర్షకులతో అనుసంధానమై వాళ్ళ పోరాటాలలో పాల్గొన్నవారే చివరిదాకా విప్లవకారులుగా నిలబడగలుగుతారని ఆయన యువతకి చెప్పాడు. అతను మరణించిన జూలై 28వ తేదీని భారతదేశంలోని మార్క్సిస్టు-లెనినిస్టులు అమరవీరుల దినంగా పాటిస్తారు.