కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
తెలుగు పండితుడు / From Wikipedia, the free encyclopedia
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (మే 18, 1877 - జూలై 12, 1923) తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త,విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు. తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు.
త్వరిత వాస్తవాలు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, జననం ...
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు | |
---|---|
జననం | మే 18, 1877 పెనుగంచిప్రోలు, కృష్ణా జిల్లా |
మరణం | జూలై 12, 1923 మద్రాసు |
మరణ కారణం | అనారోగ్యం |
వృత్తి | దివాన్, రచయిత |
ప్రసిద్ధి | చారిత్రక పరిశోధకుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త, సాహితీవేత్త |
భార్య / భర్త | కోటమాంబ |
పిల్లలు | వినాయకరావు |
తండ్రి | వెంకటప్పయ్య |
తల్లి | గంగమ్మ |
మూసివేయి