కృష్ణా పత్రిక
From Wikipedia, the free encyclopedia
కృష్ణా పత్రిక బందరు కేంద్రంగా వెలువడిన ఒక ప్రసిద్ధ వారపత్రిక. దీనిని స్వాతంత్ర్య సమరయోధులు కొండా వెంకటప్పయ్యగారు నడిపించారు. ఈ పత్రిక విశాలాంధ్రకు మద్ధతుగా పనిచేసింది. ప్రత్యేక ఆంధ్రప్రాంతం కావాలని వ్యాసాలు రాసేవారు. వెంకటప్పయ్య తరువాత కృష్ణా పత్రికను ముట్నూరి కృష్ణారావు నడిపారు. ఈ పత్రిక సాహిత్యం, రాజకీయాలు, వేదాంతం, హాస్యం, సినిమా, రంగస్థల కార్యక్రమాల సమీక్షలు, స్థానిక వార్తలు అన్నిటితొ నిండి సర్వాంగ సుందరంగా వెలువడేది. ముట్నూరి తమ అమూల్యమైన రచనలతో కృష్ణాపత్రికకు అపారమైన విలువను సంపాదించి పెట్టాడు. పాత్రికేయుడు పిరాట్ల వెంకటేశ్వర్లు దీనిని దినపత్రికగా పునరుద్ధరించారు.
త్వరిత వాస్తవాలు రకం, రూపం తీరు ...
రకం | ప్రతి దినం దిన పత్రిక |
---|---|
రూపం తీరు | బ్రాడ్ షీట్ |
యాజమాన్యం | శ్రీ గానకృష్ణా ఎంటర్ప్రైజెస్ |
ప్రచురణకర్త | కె.సత్యనారాయణK.SATYANARAYANA |
స్థాపించినది | 1902-02-02(పక్ష పత్రిక), ---(దినపత్రిక) |
కేంద్రం | హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్,ఇండియా |
జాలస్థలి | krishnapatrika.com (As of June 24, 2019 - this domain/URL does not work). |
మూసివేయి