జిక్కి
గాయని / From Wikipedia, the free encyclopedia
జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి (నవంబరు 3, 1938 - ఆగష్టు 16, 2004) తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జన్మించిన జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నది. జిక్కి తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం, పంతులమ్మ (1943) సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు. జిక్కి గాయకుడైన ఏ.ఎమ్.రాజాను ప్రేమవివాహం చేసుకున్నది. వీరికి ఆరుగురు సంతానం. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ఆదిత్య 369 సినిమాలో జాణవులే నెరజాణవులే... అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు
త్వరిత వాస్తవాలు జిక్కి, వ్యక్తిగత సమాచారం ...
జిక్కి | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | పి.జి.కృష్ణవేణి |
జననం | నవంబరు 3, 1937 చంద్రగిరి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం |
మరణం | ఆగష్టు 16, 20042004 ఆగస్టు 16(2004-08-16) (వయసు 68) |
వృత్తి | నేపధ్య గాయని |
క్రియాశీల కాలం | 1938-2004 |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/eb/PGKrishnaveni.jpg/260px-PGKrishnaveni.jpg)