కీలుగుర్రం
1949 తెలుగు సినిమా. / From Wikipedia, the free encyclopedia
కీలుగుర్రం మీర్జాపురం రాజా దర్శకత్వంలో 1949 లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, జి. వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం ప్రధాన పాత్రల్లో నటించారు. ఘంటసాల ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. తాపీ ధర్మారావు పాటలు రాశాడు.[1] తెలుగు భాషలోంచి మొట్టమొదటగా వేరే భాషలోకి (తమిళం) లోకి తర్జుమా చేయబడిన సినిమా ఇది.[2]
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
కీలుగుర్రం (1949 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మీర్జాపురం రాజా |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, జి.వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం, సూర్యశ్రీ, బాలామణి, కనకం, ఏ.వి.సుబ్బారావు, రేలంగి |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
గీతరచన | తాపీ ధర్మారావు |
ఛాయాగ్రహణం | డి.ఎల్.నారాయణ |
కళ | శర్మ |
నిర్మాణ సంస్థ | శోభనాచల పిక్చర్స్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 19, 1949 |
భాష | తెలుగు |
మూసివేయి