కాలీబంగా
రాజస్థాన్ లోని ఒక పట్టణం - సింధులోయ నాగరికతకు చెందిన స్థలం / From Wikipedia, the free encyclopedia
కాలీబంగా రాజస్థాన్, హనుమాన్గఢ్ జిల్లా పీలీబంగాన్ తెహసీల్ లోని ఒక పట్నం. ఇది ఘగ్గర్ నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. ఈ నదినే సరస్వతీ నదిగా కొందరు పండితులు భావిస్తారు.[1][2] ఈ పట్నం బికనీర్ నుండి 205 కి.మీ. దూరంలో ఉంది. దృషద్వతి, సరస్వతి నదుల సంగమ స్థలంలోని త్రికోణాకార ప్రదేశంలో ఈ పట్నం నెలకొని ఉంది.[3] సింధు లోయ నాగరికత యొక్క ప్రాక్చారిత్రిక లక్షణాలను ఈ స్థలంలోనే మొదటగా, లుయిగీ టెస్సిటోరి గుర్తించాడు. 2003 లో, ఇక్కడ తవ్వకాలు పూర్తైన 34 ఏళ్ళ తరువాత, భారత పురాతత్వ సర్వే సంస్థ తవ్వకాల నివేదికను ప్రచురించింది. సింధు లోయ నాగరికతలో కాలీబంగా ఒక పెద్ద ప్రాంతానికి రాజధానిగా ఉండేదని ఈ నివేదికలో పేర్కొన్నారు. కాలీబంగా, ఇక్కడి హోమగుండాలకు, ప్రపంచపు మొట్టమొదటి దున్నిన పొలానికీ ప్రసిద్ధమైంది.[4]
త్వరిత వాస్తవాలు స్థానం, ప్రాంతం ...
काली बंगा | |
స్థానం | రాజస్థాన్, భారతదేశం |
---|---|
ప్రాంతం | థార్ ఎడారి |
రకం | నివాస స్థావరం |
చరిత్ర | |
వదిలేసిన తేదీ | సామాన్య శక పూర్వం 20, 19 శతాబ్దాల ప్రాంతంలో |
పీరియడ్లు | Harappan 1 to Harappan 3C |
సంస్కృతులు | సింధు లోయ నాగరికత |
మూసివేయి