కర్ణాటక రాజులు
From Wikipedia, the free encyclopedia
సుప్రసిద్ద చరిత్రకారుడైన బుద్ధరాజు వరహాల రాజు గారు తన శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అను పుస్తకంలో ఆంధ్ర దేశంలో తూర్పు చాళుక్య, కోట, పరిచ్చెద, విష్ణుకుండిన, కాకతీయ వంటి తెలుగు క్షత్రియ సామ్రాజ్యాల పతనానంతరము ఆత్రేయ, పశుపతి, విశ్వామిత్ర, భరద్వాజ గోత్రముల వారు కర్ణాటక రాష్ట్రంలో దత్త మండలానికి వలసవెళ్ళారని, అనాటినుండి కర్ణాటక క్షత్రియులుగా (లేదా అరసులు) పిలువబడుతున్నారని వ్రాసిరి. భరద్వాజ గోత్రపు క్షత్రియుల జాడ మాత్రము తెలియరాకున్నది. గోత్ర నామములు, ఆచార వ్యవహారములను బట్టి కర్ణాటక రాజుల పూర్వీకులు హోయసాలులు, పశ్చిమ చాళుక్యులు, కదంబులు, హంపి విజయనగర రాజులు అయివుండవచ్చునని పలు చరిత్రకారుల ఊహ. కర్ణాటక రాజులు కర్ణాటక రాష్ట్రంలోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాల్లోను, నెల్లూరు జిల్లాల్లోనూ, గోదావరి జిల్లాల్లో కొద్దిపాటిగా కనిపిస్తారు. వీరిని కర్ణాటకలో అరసు అని, ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ రాజులు అని పిలుస్తారు. భారతీయ రిజర్వేషన్ సిష్టమ్ ప్రకారం కర్ణాటక రాష్ట్రంలో వీరు O.B.C విభాగానికి చెందుతారు.[మూలాలు తెలుపవలెను]