కర్ణాటక క్రికెట్ జట్టు
From Wikipedia, the free encyclopedia
కర్ణాటక క్రికెట్ జట్టు దేశీయ క్రికెట్ పోటీలలో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది సాంప్రదాయకంగా దేశీయ సర్క్యూట్లో బలమైన జట్లలో ఒకటిగా ఉంది. భారత క్రికెట్ జట్టులో ఆడిన అనేక మంది దిగ్గజ ఆటగాళ్లను తయారు చేసింది. 1973లో మైసూర్ రాష్ట్రం అధికారికంగా కర్ణాటకగా పేరు మార్చడానికి ముందు దీనిని మైసూరు క్రికెట్ జట్టుగా పిలిచేవారు. ఇది ఎనిమిది సార్లు రంజీ ట్రోఫీని గెలుచుకుంది. ఆరు సార్లు రెండవ స్థానంలో నిలిచింది (అంతకుముందు మైసూరు జట్టుకు చెందిన రెండు రన్నరప్ స్థానాలతో సహా). బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం ఆ జట్టుకు హోమ్ గ్రౌండ్. 2010 లలో కర్ణాటకలో క్రికెట్ మౌలిక సదుపాయాల్లో పెద్ద ప్రగతి జరిగింది. ప్రస్తుతం బెంగళూరు, మైసూరు, హుబ్బల్లి మైదానాలు నిరంతరం రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ & కర్ణాటక ప్రీమియర్ లీగ్లలో ఉపయోగించబడుతున్నాయి.