కీ బోర్డు
From Wikipedia, the free encyclopedia
కంప్యూటరుకు అనుబంధంగా ఉండే ఇన్పుట్ పరికరాల్లో కీబోర్డు ముఖ్యమైనది. వాడుకరి దీని ద్వారా అక్షరాలు, అంకెలను, కొన్ని ప్రత్యేక వర్ణాలనూ కంప్యూటరు లోకి ఎక్కించవచ్చు.
కంప్యూటర్, ఫోన్ కీ బోర్డులు సాంప్రదాయికంగా భౌతిక మీటలు కలిగివుండేవి. వీటిపై సాధారణంగా ఇంగ్లీషు అక్షరాలే ముద్రించబడివుండేవి. అందువలన తెలుగు టైపు నేర్చుకోవడం కొంత కష్టంగా వుండేది. ఇటీవల స్మార్ట్ ఫోన్ల లేక టాబ్లెట్ కంప్యూటర్ లో స్పర్శా తెర (touch screen) సాంకేతికాల వలన మిథ్యా కీ బోర్డు (ఉదాహరణ మల్టీలింగ్ తెలుగు కీ బోర్డు) వుండటం వలన తెలుగు అక్షరాలు చూపించడం, దానివలన టైపు చేయడం అత్యంత సులభం అవుతున్నది. 2013లో ఆండ్రాయిడ్ 4.2 తో తెలుగు, ఇతర భారతీయ భాషల తోడ్పాటు మెరుగై పూర్తిగా తెలుగులో వాడుకోవడానికి వీలయ్యింది. (చూడండి ప్రక్కన ఫోటోలు) సాంప్రదాయక భౌతిక కీ బోర్డులకు ప్రామాణికాలు తయారైనా అవి అంతగా ప్రజాదరణ పొందలేక, వివిధ రకాల పద్ధతులు వాడుకలోకి వచ్చాయి.