అరుణ కిరణం
From Wikipedia, the free encyclopedia
అరుణ కిరణం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1986 జూలై 24న విడుదలైన విజయవంతమైన సినిమా.[1] ఈ సినిమా మైనంపాటి భాస్కర్ రాసిన వెన్నెల మెట్లు అనే నవల ఆధారంగా రూపొందించబడింది. ఇది ముత్యాల సుబ్బయ్యకు దర్శకుడిగా రెండో సినిమా. 150 రోజులు ఆడింది.[2] కృష్ణ చిత్ర పతాకంపై వై.అనిల్ బాబు నిర్మించిన ఈ సినిమాలో రాజశేఖర్, సుత్తివేలు, విజయశాంతి లు ప్రధాన తారాగణంగా నటించగా, కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[3]
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
అరుణ కిరణం (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
---|---|
తారాగణం | రాజశేఖర్, విజయశాంతి, ముచ్చెర్ల అరుణ |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | వై.అనిల్బాబు |
భాష | తెలుగు |
మూసివేయి