భారతీయ రచయత From Wikipedia, the free encyclopedia
శ్రీలాల్ శుక్లా (డిసెంబరు 31 1925 - అక్టోబరు 28 2011[1]) ప్రముఖ హిందీ రచయిత. ఈయన హిందీ భాషలో వ్యంగ్య రచయితగా ప్రసిద్ధి పొందారు. ఉత్తర ప్రదేశ్ ప్రావిన్స్ (బ్రిటీష్ ఇండియాలో) ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్ (పి.సి.ఎస్.) అధికారిగా పనిచేశారు. స్వాతంత్ర్యానంతరం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో భాగమయ్యారు. ఆయన 25 పైగా పుస్తకాలు [2] రచించారు. ఆయన రచనలలో మకాన్ (ఆవాసం / ఇల్లు), సూనీ ఘాట్ కా సూరజ్ (సూనీ ఘాట్ సూర్యుడు), పెహ్లా పడావ్ (తొలి మజిలీ లేదా మొదటి అడుగు), బిస్రాంపూర్ కా సంత్ (బిస్రాంపూర్ సాధువు) ముఖ్యమైన నవలలు.
శ్రీలాల్ శుక్లా | |
---|---|
జననం | డిసెంబరు 31 1925 |
మరణం | అక్టోబరు 28 2011 |
వృత్తి | ప్రముఖ హిందీ రచయిత. |
ప్రసిద్ధి | ప్రముఖ హిందీ రచయిత. |
మతం | హిందు. |
స్వాతంత్ర్యానంతర భారతదేశంలో దిగజారుతున్న నైతిక విలువలకు సంబంధించిన కథాంశాలను నవలలుగా మలిచారు. ఆయన రచనలు భారతీయ గ్రామీణ, పట్టణ జీవితాల్లోని లోటుపాట్లను వ్యంగ్యంగా ఎత్తిచూపారు. ఆయన అత్యుత్తమ రచన రాగ్ దర్బారీ నవల ఆంగ్లం, తెలుగు భాషలతో సహా 15 భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆ నవలను ఆధారంగా చేసుకున్న టీవీ ధారావాహిక 1980ల్లో దూరదర్శన్ కొన్ని నెలల పాటు ప్రదర్శించింది. ఈయన ఆద్మీ కా జహర్ (మనిషి యొక్క విషం) అనే డిటెక్టివ్ నవల వ్రాసారని, అది హిందుస్తాన్ వారపత్రికలో ధారావాహికగా ప్రచురించబడిందన్న విషయం చాలా కొద్దిమందికే తెలుసు.
శ్రీలాల్ శుక్లా 1925లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో జిల్లా అత్రౌలిలో జన్మించాడు. 1947లో అలహాబాదు విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడై, 1949లో ప్రొవిన్సియల్ సివిల్ సర్వీసెస్ లో చేరి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. సివిల్ సర్వీసు ఉద్యోగిగా ఈయనకు ప్రభుత్వం యొక్క పనిరీతు, సామాన్య ప్రజల జీవితాలపై చక్కని అవగాహన ఏర్పడింది. ఈ అనుభవాలే తన వ్యంగ్య రచనలకు ఎంతగానో తోడ్పడ్డాయి.[3] శుక్లా సాహితీ వ్యాసాంగం 1954లో ప్ర్రారంభమై హిందీ సాహిత్య ప్రపంచంలో ఒక గొప్ప సాహిత్య కృషికి బీజం వేసింది. ఈయన తొలి నవల సూనీ ఘాటీ కా సూరజ్ 1957లో ప్రచురించబడింది. తొలి వ్యంగ్య రచన అంగద్ కా పావ్ 1958లో ప్రచురితమైంది. స్వాతంత్ర్యానంతర భారతదేశపు గ్రామీణ జీవితంలో దిగజారుతున్న నైతిక విలువలను పొరలు పొరలుగా ఎత్తి చూపుతూ ఈయన వ్రాసిన నవల రాగ్ దర్బారీ (1968) కి గాను 1970లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఈ నవల ఆధారంగా దూరదర్శన్లో ఒక ధారావాహిక కూడా ప్రదర్శించబడింది. 1983లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి పదవీ విరమణ పొంది, పూర్తి సమయాన్ని సాహిత్యసేవకే కేటాయించాడు.
ఇవే కాక ఈయన అనేక సాహితీ సదస్సులలో పాల్గొనటానికి, అవార్డులను అందుకోవటానికి యుగోస్లావియా, జర్మనీ, ఇంగ్లాండు, పోలాండు, సూరీనాం తదితర దేశాలు పర్యటించారు. భారత ప్రభుత్వం చైనా పర్యటనకు పంపిన రచయితల బృందానికి శ్రీలాల్ శుక్లా అధ్యక్షత వహించాడు.
అతను అనారోగ్యంతో చుట్టూ 11.45 గంటలకు 2011 అక్టోబరు 28 న లక్నోలో మరణించాడు. మరణించే ముందు భారతీయ న్యాయ వ్యవస్థపై ఒక నవల వ్రాద్దామనే ఉద్దేశంతో బోలెడంత పరిశోధన చేశాడని ఈయన సోదరుని కుమారుడు, చరిత్రకారుడైన రాజన్ శుక్లా ధ్రువపరచాడు. కానీ క్షీణిస్తున్న ఆరోగ్యం పరిస్థితి కారణంగా ఆ కార్యం పూర్తి కాలేదు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.