విభీషణుడు
రావణాసురుని తమ్ముడు From Wikipedia, the free encyclopedia
Remove ads
విభీషణుడు హిందూ పవిత్ర గ్రంథమైన రామాయణంలో ఒక ముఖ్య పాత్ర. రావణాసురునికి తమ్ముడు. విశ్రవసు కైకసియందు పుట్టిన మూడవ కుమారుడు. సీతను రావణాసురుడు అపహరించిన తర్వాత ఆమెను మళ్ళీ రామునికి అప్పగించమని అన్న రావణునికి పలు విధాల చెప్పిచూశాడు. రావణుడు అతని సలహాను పాటించకపోగా అవమానిస్తాడు. విభీషణుడు వెళ్ళి రాముని శరణు వేడుతాడు. రామ రావణ యుద్ధంలో రాముడికి రావణుడి ఆయువు పట్టు చెప్పి అన్న మరణానికి కారణం అయ్యాడు. రావణుడి తర్వాత లంకా సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. ఈయన చిరంజీవి.[1]
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |

Remove ads
శ్రీరంగం
శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయ పురాణంలో విభీషణుడి ప్రస్తావన ఉంది.ఈ పురాణం ప్రకారం శ్రీరాముని పట్టాభిషేక సమయంలో అక్కడికి వచ్చిన విభీషణుడికి విమాన విగ్రహం లభిస్తుంది. దాన్ని తీసుకుని తన లంకా సామ్రాజ్యంలో ప్రతిష్ఠించుకోవాలనుకుంటాడు. దారి మధ్యలో విశ్రాంతి కోసం ఆ విగ్రహాన్ని కావేరి నది గట్టున ఉంచి పూజలు నిర్వహిస్తాడు. కానీ దాన్ని లేపి తీసుకెళ్ళడానికి సాధ్యపడదు. అప్పుడు మహావిష్ణువు విభీషణుడికి కలలో కనబడి తాను ఆ ప్రదేశంలోనే కొలువై ఉంటానని చెప్పాడు. అప్పటి నుంచి ఆ ప్రదేశం శ్రీరంగంగా వ్యవహరించబడుతోంది.[2]
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads