From Wikipedia, the free encyclopedia
విషయం అర్థవంతముగా, సంపూర్ణముగా స్పష్టముగా భావప్రకటన కలిగించెడి పదముల సముదాయమును వాక్యం అంటారు. వాక్యములో మూడు ప్రధానమైన భాగాలు ఉన్నాయి.
హిందూమతం లోని ఆధ్యాత్మిక, ఉపనిషత్తుల సారము నాలుగు మహా వాక్యాలు. ఒక్కొక్క వేదం యొక్క సారమే ఒక మహావాక్యంగా ఈ మహాకావ్యాలు చెబుతాయి.
అత్యంత ప్రాచీన కాలముననే మన దేశమున శాస్త్రకారులు వాక్య నిర్వచన గావించారు. పదసమూగము నుండి పుట్టిన అర్థము వాక్యమట- పద సంఘాతజం వాక్యం (బృహద్దేవత), పదములవలన గాక పదార్థముల వలనే వాక్యము పుట్టుచున్నదని కుమారిల భట్టు - పదార్థైః పద విజ్ఞాతైః వాక్యార్థః ప్రతి ఉద్యతె (తంత్ర వార్తికము), ఆకాంక్ష కలిగి ఏకార్థమును బోధించునది వాక్యము (మీమాంస సూత్రము), వాక్యము నిరాకాంక్షమని కాత్యాయన శ్రౌత సూత్రము చెప్పుచున్నది. అనగా వాక్యము తనకు వెలుపలి పదములతో ఆకాంక్షలేక స్వయం సమగ్రమగుట అన్నమాట. వక్త చేసిన అర్థయుక్తమైన శబ్ద సముదాయము వాక్యము.
వాక్యములో "యోగ్యత, ఆకాంక్ష, ఆసత్తి" అను మూడు అంశములుండవలెను. ప్రాచీనులు యోగ్యత అనగా సంబంధార్హత్వము అనిరి. ఇది వాక్యామాత్ర పరము. అర్ధ అబాధ అర్ధాపరము. దీనినే కొందరు బోధా నిశ్చయ అభావమని అంటారు. ఆకాంక్ష అనగా నిలుపుదల లేకుండా వెంటవెంటనే వచ్చు పదార్ధముల మీది ఆదరము. ఇది వినువారికి తెలిసికొనవలెను అను అపేక్షారూపమున ఉండును. పులి, సింహము, ఏనుగు అని పల్కినచో వినువారికి ఆకాంక్ష కలుగదు. అదే ఇది పులి, ఇది సింహము, ఇది ఏనుగు అని అనగానే ఏది పులి, ఎక్కడ ఉంది అను ఆకాంక్షకు అవకాశమున్నది. ఆసత్తి అనునది వాక్యమందలి పదములను సన్నిహిత్యముగ ఉచ్చరించునపుడు గాని అర్థము బోధపడదు. రాముడు అను పదము ఇప్పుడును, సీత అను పదము మరియొక గంటకును, అడవికి వెళ్ళిరు అని రేపు చెప్పినచో వాక్యము కానేరదు. కుమారిలభట్టు చెప్పినట్లు ఆకాంక్ష అనగా పదార్ధముల పరస్పర జిజ్ఞాసా విషయత్వ యోగ్యత. వాక్యా భాగములు (క్రింద తెలిపడిన) ఈ మూడు అంశములతో ముడిపడి ఉన్నాయి.
అనగా క్రియా శ్రవణము వలన కారకము యొక్కయు, కారక శ్రవణము వలన క్రియ యొక్కయు, అట్లే కారణ శ్రవణము వలన కర్తవ్యము యొక్కయు జిజ్ఞాస కలుగును. ఉదా: కొట్టు అను క్రియ వినగానే దేనిచే? అను కారక జిజ్ఞాస, కర్రచే అనగానే ఏమి చేయవలెను? అను క్రియా జిజ్ఞాస కలుగును. అట్లే వాన వచ్చుచున్నది అని వినగానే గొడుగు తెరుచుకొనుటయో, తడువని చోటుకుపోయి నిలుచుండవలెనని ఇతి కర్తవ్యతా రూపమైన జిజ్ఞాస కలుగును. ఇది వాక్యమాత్ర పరము. తెమ్ము అనే క్రియకు దేనిని? అను సహజ జిజ్ఞాస. ఇది ఉత్తింతాకాంక్ష అనబడును. ఆసత్తి అనునది సన్నిహిత్య అభావము, శబ్దబోధిత్వ అభావము అను రెండు రకములు. సన్నిహిత్య అభావములో పదముల అవ్యవధానము లేకుండుట-ఫలితముగా అర్థము ఉపస్థితి తప్పుట-రెండవదానిలో శబ్దము లోపించుట. "ఆవును కట్టివేయుము" అనుటకు గుర్రమును కట్టి వేయుము అనుట, మీమాంసకులు లోపించిన శబ్దమును ఊహించినచో శ్రుతార్ధాపత్తి అంటారు. ప్రకరణమును బట్టి క్రియను ఊహించినచో క్రియార్దాపత్తి. తలుపు అనగానే తీయవలెనా? మూయవలెనా? అను దానిని ఊహించినట్లు. శ్రుతార్ధాపత్తిలో కేవల శబ్దమును ఊహించుట. ఇదే అభిదానాపత్తి అగును.
ఉదా: "నా కన్నా గొప్ప రచయిత తెలుగులో మరొకరు లేరు " అని సుబ్బారావు, వెంకట్రావుతో అన్నాడు.
ఈ రెండూ అనుకరణాలే. అనుకరణంలో అంతా చెప్పి చివరికి "అని" అనేదాన్ని వాడతాం. దీనికి అనుకారకం అని పేరు. ఇతరులు చెప్పిన దాన్ని, లేక తాను చెప్పిన దాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుకరించి చెప్పడం ప్రత్యక్షానుకృతి. ఉదా: నేను నీతో "నేను రాను" అని చెప్పాను.అనుకరించిన దానిలోని విషయాన్ని లేదా అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం పరోక్షానుకృతి. ఉదా: నేను నీతో రానని చెప్పాను.
Seamless Wikipedia browsing. On steroids.